FPI: తగ్గిన విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వేగం
డాలర్ బలపడడం, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు వంటి కారణాలతో విదేశీ మదుపర్లకు భారత్ మార్కెట్లను వీడుతూనే ఉన్నారు....
దిల్లీ: డాలర్ బలపడడం, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు వంటి కారణాలతో విదేశీ మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్లను వీడుతూనే ఉన్నారు. జులై నెలలో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లను దేశీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. అయితే, గత కొన్ని వారాలుగా ఉపసంహరణ వేగం తగ్గడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 100 డాలర్ల సమీపానికి చేరడంతో ద్రవ్యోల్బణ భయాలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. మరోవైపు రూపాయి పతనాన్ని ఆపేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగడం మార్కెట్ల సెంటిమెంటును పెంచింది. దీంతో గతవారం మార్కెట్లో కొంత ర్యాలీ కనిపించింది. అయితే, మార్కెట్లలో గడ్డు పరిస్థితులు ముగిశాయనడానికి ఎఫ్పీఐ ఉపసంహరణ తగ్గడం ఏమాత్రం సంకేతం కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచించే స్థూల కారణాల్లో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదని వివరించారు. గత తొమ్మిది నెలలుగా ఎఫ్పీఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
ద్రవ్యోల్బణం ముగిసినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డ తర్వాతే ఎఫ్పీఐలు తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశిస్తారని యెస్ సెక్యూరిటీస్ లీడ్ అనలిస్ట్ హితేశ్ జైన్ అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల తగ్గుముఖం పడితే కేంద్ర బ్యాంకులు సైతం రేట్ల పెంపు విషయంలో కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితులు ఆగస్టు-సెప్టెంబరు త్రైమాసికంలో చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.
డిపాజిటరీస్ వద్ద ఉన్న లెక్కల ప్రకారం.. జులై 1-8 మధ్య ఎఫ్పీఐలు రూ.4,096 కోట్లు విలువ చేసే పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. జులై 6న రూ.2,100 కోట్ల విలువ చేసే కొనుగోళ్లు చేశారు. గతకొన్ని వారాల్లో ఈ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టడం ఇదే తొలిసారి. జూన్లో మొత్తంగా విదేశీ మదుపర్లు రూ.50,203 కోట్లు ఉపసంహరించుకున్నారు. మార్చి 2020 తర్వాత ఇంత పెద్దఎత్తున పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవడం ఇదే మొదటిసారి. ఫలితంగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకూ పతనమవుతూ వస్తోంది. ఇటీవల రూ.79 మార్క్ను దాటి జీవితకాల కనిష్ఠానికి చేరింది. భారత్తో పాటు వర్ధమాన మార్కట్లయిన ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్లాండ్ నుంచి కూడా మదుపర్లు పెట్టుబడులను ఉపంహరించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.