స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఆర్ఆర్బీల నమోదు!
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడం ద్వారా నిధులను సమీకరించుకునేందుకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)లకు వీలు కల్పించే అంశంలో భాగంగా ఆర్థిక శాఖ అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలు జారీ చేసింది.
ముసాయిదా నిబంధనలు జారీ చేసిన ఆర్థిక శాఖ
దిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడం ద్వారా నిధులను సమీకరించుకునేందుకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)లకు వీలు కల్పించే అంశంలో భాగంగా ఆర్థిక శాఖ అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా గడిచిన మూడేళ్లలో బ్యాంక్ నికర విలువ కనీసం రూ.300 కోట్లుగా ఉండాలి. ఆ సమయంలో మూలధన కనీస నిష్పత్తి కూడా నియంత్రణ సంస్థలు నిర్దేశించిన కనీస స్థాయి అయిన 9 శాతం కంటే పైనే ఉండాలి. గడిచిన 5 ఏళ్లలో మూడేళ్లపాటు ఆర్ఆర్బీలు కనీసం రూ.15 కోట్ల మేర నిర్వహణ లాభం ఆర్జించి ఉండాలి. 5 ఏళ్లలో కనీసం మూడేళ్లు ఈక్విటీపై 10 శాతం ప్రతిఫలం అందించి ఉండాలి. ముసాయిదా నిబంధనల మేరకు ప్రాయోజిత బ్యాంక్లు ఐపీఓలకు సరిపోయే ఆర్ఆర్బీలను గుర్తించాల్సి ఉంటుంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ల నియమ నిబంధనలు పరిగణనలోకి తీసుకుని ప్రాయోజిత బ్యాంక్లు ఆర్ఆర్బీలను ఐపీఓలకు సూచించాల్సి ఉంటుంది. వ్యవసాయ రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషించే ఆర్ఆర్బీలను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు) ప్రాయోజితం (స్పాన్సర్) చేస్తుంటాయి. ప్రస్తుతం ఆర్ఆర్బీల్లో 50 శాతం వాటా కేంద్రం వద్ద, 35 శాతం వాటా ప్రాయోజిత బ్యాంక్ వద్ద, 15 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటోంది. ఆర్ఆర్బీ చట్టం 1976 ప్రకారం ఆర్ఆర్బీలను ఏర్పాటు చేశారు. చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తుల వారికి రుణాలు, ఇతర సదుపాయాలు కల్పించే ప్రధాన ఉద్దేశంతో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
* ప్రస్తుతం దేశంలో 43 ఆర్ఆర్బీలు ఉండగా, 12 పీఎస్బీలు స్పాన్సర్ చేస్తున్నాయి. 26 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో (పుదుచ్చేరి, జమ్ము-కశ్మీర్, లద్దాఖ్) కలిపి ఆర్ఆర్బీలకు 21,856 శాఖలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.