రాబోయే సంవత్సరాల్లో 6.5% పైనే వృద్ధి
ప్రస్తుత దశాబ్దంలో మిగిలిన ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు 6.5 శాతం ఎగువనే నమోదవుతుందనే ఆశాభావాన్ని ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతర నాగేశ్వరన్ వ్యక్తం చేశారు.
ముంబయి: ప్రస్తుత దశాబ్దంలో మిగిలిన ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు 6.5 శాతం ఎగువనే నమోదవుతుందనే ఆశాభావాన్ని ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతర నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని 6.5-7 శాతం వృద్ధితో ముగించే అవకాశం ఉందంటూ.. ప్రైవేటు రంగ విశ్లేషకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), అంతర్జాతీయ ఏజెన్సీలు వేసిన అంచనాలను గుర్తు చేశారు. సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ గణాంకాలు కొద్ది రోజుల్లో రానున్నాయని.. అవి ఈ విషయంలో స్పష్టత తీసుకొస్తాయని ఆయన అన్నారు. 2023-24లో వృద్ధిరేటు 6-6.2 శాతం ఉండొచ్చని అంతర్జాతీయ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయని గురువారమిక్కడ జరిగిన ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సులో నాగేశ్వరన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని సిటీ గ్రూప్, 7.3 శాతమని ఎస్ అండ్ పీ రేటింగ్స్ అంచనా వేశాయి. ఆర్బీఐ 7 శాతంగా పేర్కొంది. ‘ఈ దశాబ్దంలో మిగతా ఆర్థిక సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 6.5 శాతంపైనే నమోదుకావొచ్చు. గిరాకీకి అంతర్గత కారకాలు బలంగా ఉండడమే ఇందుకు కారణం. ప్రైవేటు మూలధన వ్యయాలు పునః ప్రారంభం కావడం; కొన్నేళ్లుగా నిర్మాణాత్మక సంస్కరణలు కొనసాగుతుండడం వల్ల మధ్యకాలంలో వృద్ధి అధికంగానే కొనసాగగలద’ని ఆయన వివరించారు. ‘ప్రైవేటు రంగంలో మూలధన వ్యయాలు ఇప్పటికే రూ.3 లక్షల కోట్లను అధిగమించాయని, మార్చి ఆఖరుకు రూ.6 లక్షల కోట్లకు చేరుతాయ’ని ఆయన అంచనా వేశారు.
భారత ఎగుమతులపై మందగమన ప్రభావం.. గోయెల్ : ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి, మందగమన ధోరణులు భారత ఎగుమతులపై ప్రభావం చూపొచ్చని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయెల్ అంచనా వేశారు. అయితే సేవల ఎగుమతుల వల్ల వృద్ధికి భారీ అవకాశాలున్నాయన్నారు. ‘ప్రపంచ మందగమన ప్రభావం భారత్పైనా కొంత ఉండొచ్చు. మన ఎగుమతుల్లో కొంత బలహీనతలు కనిపించొచ్చ’ని గురువారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. 2022 ఏప్రిల్-అక్టోబరులో ఎగుమతులు 12.55% వృద్ధితో 263.35 బి. డాలర్లకు చేరగా.. దిగుమతులూ 33.12% పెరిగి 436.81 బి. డాలర్లకు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.