చమురు ఉత్పత్తిలో మార్పులేదు:ఒపెక్
రష్యా చమురుపై పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలోనూ, ముడిచమురు ఉత్పత్తి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించాలన్న గత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఒపెక్ దేశాలు ఆదివారం తెలిపాయి.
రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోత కొనసాగింపు
ధరల పరిమితిని అంగీకరించకున్నా బ్యారెల్ 60 డాలర్లకే రష్యా విక్రయం
ఫ్రాంక్ఫర్ట్: రష్యా చమురుపై పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలోనూ, ముడిచమురు ఉత్పత్తి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించాలన్న గత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఒపెక్ దేశాలు ఆదివారం తెలిపాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడానికి తోడు చైనాలో గిరాకీ తక్కువగా ఉందనే భావనతో, నవంబరు 1 నుంచి చమురు ఉత్పత్తి తగ్గించాలని అక్టోబరులో నిర్వహించిన సమావేశంలో ఒపెక్+ రష్యా దేశాలు నిర్ణయించిన సంగతి విదితమే. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తమ సరఫరా లక్ష్యాలను మార్చకూడద’ని చమురు ఎగుమతి దేశాలు ఆదివారం నాటి సమావేశంలో పునరుద్ఘాటించాయి.
* ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తున్నందున, రష్యా ఎగుమతి చేసే చమురుకు గరిష్ఠ ధర 60 డాలర్లుగా నిర్ణయిస్తూ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్తో పాటు ఐరోపా సమాఖ్య పరిమితి విధించింది. రష్యా చమురు దిగుమతిని నిషేధించాలనీ ఐరోపా దేశాలు నిర్ణయించాయి. సోమవారం నుంచి ఇది అమలు కానుంది. ఈ ప్రభావం ఎలా ఉంటుందో గమనించాల్సి ఉంది.
* రష్యా నుంచి ఐరోపా కనుక చమురు దిగుమతి చేసుకోకపోతే, ఆ ప్రభావం ప్రపంచంపై ఎలా పడుతుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సరఫరాలు తగ్గడం వల్ల, ధరలు కూడా మళ్లీ పెరిగే అవకాశం ఉంది. నెల క్రితం బ్యారెల్ ముడిచమురు ధర 98 డాలర్లు కాగా, ఇప్పుడు 86 డాలర్ల వద్ద ఉంది.
* తమ చమురుకు 60 డాలర్లలోపే చెల్లించాలన్న పాశ్చాత్య దేశాల నిర్ణయంపై పుతిన్ సర్కారు మండిపడింది. ధర తగ్గింపును సమర్థిస్తున్న దేశాలకు సరఫరా నిలిపివేస్తామని, రష్యా చమురుకు ఐరోపా దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం రష్యా బ్యారెల్ 60 డాలర్ల చొప్పునే చమురు విక్రయిస్తుండటం గమనార్హం. ఇందువల్ల ‘పాశ్చాత్య దేశాల ధరల పరిమితిని అంగీకరించకపోయినా’ రష్యా అదే ధర వద్ద విక్రయాలు కొనసాగించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.