రూ.10,000తో మొదలై రూ.6.63 లక్షల కోట్లకు
అంకుర సంస్థలకు ఇప్పుడు ప్రాచుర్యం లభిస్తోంది. అయితే 4 దశాబ్దాల కిత్రం, ఈ పదమే తెలియని రోజుల్లో ఏడుగురు ఔత్సాహికులు ఒక ఐటీ సంస్థను స్థాపించి..దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా ఎదిగేలా తీర్చిదిద్దారు..
ఇన్ఫీ 40 ఏళ్ల ప్రస్థానం
అంకుర సంస్థలకు ఇప్పుడు ప్రాచుర్యం లభిస్తోంది. అయితే 4 దశాబ్దాల కిత్రం, ఈ పదమే తెలియని రోజుల్లో ఏడుగురు ఔత్సాహికులు ఒక ఐటీ సంస్థను స్థాపించి.. దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా ఎదిగేలా తీర్చిదిద్దారు.. అదే 3.14 లక్షల మందికి మెరుగైన ఉపాధి కల్పిస్తూ, రూ.1.33 లక్షల కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఇన్ఫోసిస్. ఎన్.ఆర్. నారాయణ మూర్తి తన భార్య సుధా మూర్తి నుంచి తీసుకున్న రూ.10,000 పెట్టుబడితో మొదలైన కంపెనీ ప్రస్థానం, రూ.6.63 లక్షల కోట్ల మార్కెట్ విలువగా మారి, మరింత జోరుగా కొనసాగుతోంది.
ఈ ప్రయాణంలో ప్రధాన మైలురాళ్లు
* 1981లో ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ నుంచి ఏడుగురు ఇంజినీర్లు బయటకు వచ్చారు. వారంతా కలిసి ఇన్ఫోసిస్ కన్సల్టంట్స్ పేరిట ఒక అంకురాన్ని పుణెలో ఏర్పాటు చేశారు. వారే.. ఎన్.ఆర్. నారాయణ మూర్తి, నందన్ నీలేకని, ఎన్.ఎస్.రాఘవన్, ఎస్.గోపాలకృష్ణన్. ఎస్.డి.శిబూలాల్, కె.దినేశ్, అశోక్ అరోరా.
* 1983లో బెంగళూరుకు తమ కార్యాలయాన్ని మార్చారు.
* 1987లో అమెరికాలో అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటు
* 1993లో ఉద్యోగులకు షేర్లను ఇవ్వడం తొలిసారి ప్రవేశపెట్టింది ఈ కంపెనీయే. అదే ఏడాది బీఎస్ఈలో నమోదైంది.
* 1999లో 100 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని చేరుకుంది. నాస్డాక్లోనూ నమోదైంది.
* 2004లో బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని పొందింది.
* 2006లో ఉద్యోగుల సంఖ్య 50,000ను అధిగమించింది.
* 2007లో త్రైమాసిక ఆదాయమే 100 కోట్ల డాలర్లు
* 2009లో ఒక లక్ష మంది ఉద్యోగుల మార్కుకు చేరింది.
* 2014లో తొలిసారిగా వ్యవస్థాపకేతర వ్యక్తి విశాల్ సిక్కా సీఈఓగా నియామకం
* 2017లో సిక్కా స్థానంలో ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ను నియమించారు.
* 2021 జులైలో 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించిన రెండో ఐటీ కంపెనీగా మారింది. (టీసీఎస్ తొలి కంపెనీ)
కొనుగోళ్లలో దూకుడు తక్కువే..
ఇన్ఫోసిస్ స్థాయికి ఎన్నో సంస్థలను కొనుగోలు చేసి ఉండాలి. అయితే ఇప్పటిదాకా 21 కొనుగోళ్లు మాత్రమే చేపట్టింది. అందులో 11 గత అయిదేళ్లలో చేసినవే. లోడ్స్టోన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ను 2012లో 345 మి. డాలర్లతో సొంతం చేసుకోవడమే ఇప్పటిదాకా అతిపెద్ద కొనుగోలు. సిబ్బంది అధిక వలసలే ప్రస్తుతం సమస్యగా ఉంది.
భవిష్యత్తులో ఈ కంపెనీ మరిన్ని మైలురాళ్లనైతే అధిగమించడం తథ్యం.
ఇన్ఫీ వ్యవస్థాపకుల ఉత్సాహం
క్యాంపస్లో కలియదిరుగుతూ జ్ఞాపకాల నెమరువేత
బెంగళూరు: 40 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా బెంగళూరులో ఈనెల 13, 14 తేదీల్లో కంపెనీ సంబరాలు నిర్వహించింది. ఇన్ఫీ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణమూర్తి, నందన్ నీలేకని, ఎస్.గోపాలకృష్ణన్, ఎస్.డి. శిబూలాల్, కె.దినేశ్లు బుధవారం బెంగళూరులోని ఇన్ఫీ ప్రధాన కార్యాలయంలో కలియదిరుగుతూ ఎన్నో జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. విలువలను పాటిస్తూ, కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు నాయకత్వ స్థానంలో సరైన వ్యక్తులను నియమించడమే ఇపుడు తమపై ఉన్న పెద్ద బాధ్యత అని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నీలేకని పేర్కొన్నారు.
వారిద్దరికీ కృతజ్ఞతలు: నారాయణమూర్తి
‘ఇన్ఫోసిస్కు 2014-17 మధ్య గడ్డుకాలం నడిచింది. మళ్లీ నందన్ నీలేకని ముందుకొచ్చి, ప్రస్తుత సీఈఓ సలీల్ ఫరేఖ్తో కలిసి అత్యంత సమర్థంగా నడిపించా’రంటూ వారికి నారాయణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.‘75 ఏళ్ల వయసులో నేను మళ్లీ బాధ్యతలు చేపట్టలేను. ఇతర వ్యవస్థాపకులదీ ఇదే పరిస్థితి. గట్టిపునాదులున్న ఈ సంస్థ ఎక్కువ కాలం మనగలిగేలా యువ యాజమాన్యం ప్రణాళికలు రూపొందించాల’ని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!