మా అప్పులపై చర్చలెందుకు?
‘మా గ్రూప్లోని వ్యాపార విభాగాల రుణాలు తగ్గుతూ ఉన్నాయి. వేగంగా వృద్ధి చెందుతున్న మా గ్రూప్ను లోతుగా అర్థం చేసుకుంటే.. అప్పుల విషయంలో ఎటువంటి ఆందోళనలైనా తుడిచిపెట్టుకుపోతాయ’ని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తెలిపారు.
రుణాల కంటే రెండింతల లాభాలున్నాయ్
మా గ్రూప్ ఆర్థికంగా బలంగా ఉంది
గౌతమ్ అదానీ
‘మా గ్రూప్లోని వ్యాపార విభాగాల రుణాలు తగ్గుతూ ఉన్నాయి. వేగంగా వృద్ధి చెందుతున్న మా గ్రూప్ను లోతుగా అర్థం చేసుకుంటే.. అప్పుల విషయంలో ఎటువంటి ఆందోళనలైనా తుడిచిపెట్టుకుపోతాయ’ని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తెలిపారు. తమ గ్రూప్ అప్పులపై జరుగుతున్న చర్చలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని ఒక వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ‘గత తొమ్మిదేళ్లలో.. మా అప్పులతో పోలిస్తే మా లాభాలు.. రెండింతల రేటుతో వృద్ధి చెందాయి. మా గ్రూప్ ఆర్థికంగా చాలా బలంగా, భద్రంగా ఉంది. అప్పులు, ఎబిటా మధ్య నిష్పత్తి ఈ తొమ్మిదేళ్లలో 7.6 శాతం నుంచి 3.2 శాతానికి పరిమితమైంది. మౌలిక రంగంలో ఎక్కువ కంపెనీలు ఉన్న ఒక పెద్ద గ్రూప్నకు ఇవి చాలా ఆరోగ్యకర గణాంకాల’ని ఆయన వివరించారు.
* తొలి తరం పారిశ్రామికవేత్త అయిన అదానీ, 2022లో ప్రపంచంలోనే అత్యంత అధికంగా సంపదను జత చేసుకున్న వ్యక్తిగా నిలిచారు కూడా. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ గ్రూప్లో కొత్త వ్యాపారాలు, కొనుగోళ్లు కనిపించాయి. పోర్టులు, బొగ్గు వ్యాపారాల నుంచి హరిత ఇంధనం, విమానాశ్రయాలు, సిమెంటు, మీడియా, డేటా సెంటర్లు, లోహాలు.. ఇలా అన్ని రంగాల్లోనూ గ్రూప్ విస్తరించింది. అప్పులతోనే ఇంతగా వ్యాపారాలు విస్తరిస్తున్నారని కొంత మంది విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అదానీ స్పందిస్తూ ‘మా కంపెనీలు మిశ్రమ రుణాన్ని కలిగి ఉన్నాయి. భారత బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు.. మా మొత్తం అప్పుల్లో 86 శాతం నుంచి 32 శాతానికి తగ్గాయి. దాదాపు మా రుణాల్లో 50 శాతం మేర అంతర్జాతీయ బాండ్ల ద్వారా తీసుకున్నామ’ని వివరించారు.
ప్రతి 12-18 నెలలకు లక్ష కోట్ల డాలర్లు జీడీపీకి జతవుతాయ్: ఇతర అంశాలపై మాట్లాడుతూ ‘ఈ శతాబ్దం భారత్దే. వచ్చే దశాబ్దంలో ప్రతి 12-18 నెలలకు జీడీపీకి ఒక లక్ష కోట్ల డాలర్లను దేశం జత చేయగలదు. మధ్యతరగతి, యువ జనాభా భారీగా ఉండడం ఇందుకు దోహదం చేస్తుంది. హరిత హైడ్రోజన్ ఎగుమతిదారుగా మనదేశం మారుతుంది. అంతర్జాతీయ మాంద్యంపై ఉన్న ఆందోళనలకు సమాధానం ఇవ్వడానికి వచ్చే బడ్జెట్ గొప్ప అవకాశం. మూలధన వ్యయాలు, ఉపాధి, సామాజిక మౌలిక వసతులు, సామాజిక భద్రతపై దృష్టి సారిస్తే.. అంతర్జాతీయ ఇబ్బందులను భారత్ ఎదుర్కొంటుంది. మా ఆధీనంలోకి వచ్చిన ఎన్డీటీవీ సంపాదకీయం స్వతంత్రంగానే ఉంటుంది. అది ఒక విశ్వసనీయ, స్వతంత్ర అంతర్జాతీయ నెట్వర్క్గా కొనసాగుతుంద’ని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.