ట్విటర్ ప్రధాన కార్యాలయానికి అద్దె కట్టలేదు
సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్పై కోర్టుల్లో దావాల పర్వం కొనసాగుతోంది. అమెరికా (శాన్ఫ్రాన్సిస్కో)లో కంపెనీకి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు, బ్రిటన్ఓని కార్యాలయాలకూ అద్దె చెల్లించకపోవడంతో, సంబంధిత భవన యజమానులు ట్విటర్ యజమాని మస్క్ను కోర్టుకు లాగుతున్నారు.
భవన యజమానుల దావా
లండన్: సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్పై కోర్టుల్లో దావాల పర్వం కొనసాగుతోంది. అమెరికా (శాన్ఫ్రాన్సిస్కో)లో కంపెనీకి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు, బ్రిటన్ఓని కార్యాలయాలకూ అద్దె చెల్లించకపోవడంతో, సంబంధిత భవన యజమానులు ట్విటర్ యజమాని మస్క్ను కోర్టుకు లాగుతున్నారు. కాలిఫోర్నియా కోర్టు పత్రాల ప్రకారం.. ప్రధాన కార్యాలయ భవనానికి అద్దె చెల్లించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై, ట్విటర్ దావాను ఎదుర్కొంటోంది. సెంట్రల్ లండన్లో కంపెనీ కార్యాలయాల భవనాల అధిపతి కూడా, అద్దె బకాయిల విషయమై ట్విటర్ను కోర్టుకు లాగుతానని అంటున్నారు. గతేడాది 44 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందంతో ట్విటర్ను సొంతం చేసుకున్న మస్క్.. ఏటా 100 కోట్ల డాలర్ల మేర వడ్డీ కట్టాల్సి వస్తోంది. ఇప్పటికే శాన్ఫ్రాన్సిస్కోలో మరో కార్యాలయ అద్దె చెల్లించకపోవడంతో, ఈ నెలలో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక టెస్లా పెట్టుబడుదార్ల నుంచి కూడా మస్క్ ఒక క్లాస్-యాక్షన్ దావాను ఇప్పటికే ఎదుర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.