లారస్ ల్యాబ్స్ ఆదాయాల్లో 50% వృద్ధి
లారస్ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,545 కోట్ల ఆదాయాన్ని, రూ.203 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఈపీఎస్
ఈనాడు, హైదరాబాద్: లారస్ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,545 కోట్ల ఆదాయాన్ని, రూ.203 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.3.7గా ఉంది. 2021-22 ఇదేకాల ఆదాయం రూ.1028 కోట్లతో పోలిస్తే 50%, నికరలాభం రూ.154 కోట్లతో పోలిస్తే 32% పెరిగాయి. సింథసిస్ విభాగంలో 60 కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తున్నామని, సీడీఎంఓ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకునే సన్నాహాల్లో ఉన్నట్లు వివరించింది. డిసెంబరు త్రైమాసికంలో జనరిక్ ఎఫ్డీఎఫ్ (ఫినిష్డ్ డోసేజ్ ఫార్ములేషన్స్) ఆదాయాలు 33% తగ్గినా, జనరిక్ ఏపీఐ ఆదాయాలు 49% పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి లారస్ ల్యాబ్స్ రూ.4,660 కోట్ల ఆదాయాన్ని, రూ.687 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఈపీఎస్ రూ.12.7గా ఉంది. ఎబిటా మిగులు 28 శాతం, నికరలాభాల మిగులు 15 శాతం ఉన్నాయి.
కొత్త ఔషధాల ఆవిష్కరణకు పరిశోధనలు: మూడో త్రైమాసిక ఫలితాలపై లారస్ ల్యాబ్స్ సీఈఓ సత్యనారాయణ చావ స్పందిస్తూ, దాదాపు అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు ప్రదర్శించినట్లు చెప్పారు. ఏఆర్వీ ఎఫ్డీఎఫ్ విభాగంలో కొంత సానుకూల పరిస్థితి కనిపించినట్లు తెలిపారు. హెచ్ఐవీ మందుల కోసం కొన్ని ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ‘ప్యానెల్ సప్లయర్’గా ఎంపికైనట్లు వెల్లడించారు. కొత్త ఔషధాలను ఆవిష్కరించడానికి పరిశోధన- అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో పరిశోధన- అభివృద్ధికి లారస్ ల్యాబ్స్ రూ.153 కోట్లు వెచ్చించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల వరకు మూలధన పెట్టుబడి పెడుతున్నామని, ఇందులో మూడో వంతు ఇప్పటికే వెచ్చించినట్లు సత్యనారాయణ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.