వడ్డీ రేట్లు మరింత పైకి
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేస్తోంది.
ఈనాడు, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపోరేటును పెంచుతున్నందున, బ్యాంకులకు నిధుల లభ్యత తగ్గుతోంది. ఫలితంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేటును 100-150 బేసిస్ పాయింట్ల మేరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది.
నిధుల సమీకరణకు: డిపాజిట్ల ద్వారా డబ్బును సేకరించడం, రివర్స్ రెపో లేదా స్టాండింగ్ డిపాజిట్లో ఉన్న డబ్బును వెనక్కి తీసుకోవడం ద్వారా రుణాల జారీకి అవసరమైన నిధులు సమీకరించేందుకు బ్యాంకులు ఇప్పటి వరకు ప్రయత్నించాయి. దీంతో రుణ రేట్లను పెద్ద ఎత్తున పెంచే విషయంలో బ్యాంకులకు అంత ఒత్తిడి ఎదురవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు దాదాపు రూ.5లక్షల కోట్లను రివర్స్ రెపో ఖాతాల నుంచి వెనక్కి తీసుకుని, రుణాల జారీకి వినియోగించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ అవకాశం కనిపించడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులు నిధుల వ్యయం ఆధారిత రుణరేట్లను (ఎంసీఎల్ఆర్) పెంచకతప్పకపోవచ్చనే అంచనాలున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో 2.50% పెంపు
ఈ ఆర్థిక సంవత్సరం మే నుంచి ఆర్బీఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది. కేంద్ర బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ రుణ రేట్లను నిధుల సమీకరణ వ్యయాల ఆధారంగా ప్రతి నెలా సవరిస్తూ ఉంటాయి. ముందస్తు పన్ను, జీఎస్టీ చెల్లింపులు తదితర కారణాల వల్ల వచ్చే కొన్ని వారాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో, ద్రవ్య లభ్యత కఠినతరం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. దీర్ఘకాలిక రెపో వేలం, స్వల్పకాలిక బాండ్లు, ట్రెజరీ బిల్లులను బహిరంగంగా మార్కెట్లో కొనుగోలు వంటి విభిన్న సాధనాలను ఉపయోగించి ద్రవ్య లభ్యత విషయంలో బ్యాంకింగ్ వ్యవస్థకు ఆర్బీఐ మద్దతు ఇస్తుందని ఫిచ్ గ్రూపు కంపెనీ అంచనా వేస్తోంది. నగదు లభ్యత తక్కువగా ఉంటుందని భావిస్తున్న స్వల్ప కాల వ్యవధిలో, బలహీన సంస్థలకు సమస్యాత్మకంగా మారొచ్చని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. 2023-24లో పాలసీ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థ వడ్డీ రేట్ల విషయంలో కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది.
రుణ రేట్లు పెంచిన ఎస్బీఐ
ఎస్బీఐ బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 70 బేసిస్ పాయింట్ల మేరకు పెంచి, 14.85% చేసినట్లు ప్రకటించింది. కొత్త రేటు నేటి నుంచి అమల్లోకి రానుంది. బేస్ రేటునూ 70 బేసిస్ పాయింట్లు పెంచి, 10.10 శాతానికి చేర్చింది. ఎంసీఎల్ఆర్ను మాత్రం పెంచలేదు. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.50%, రెండేళ్ల వ్యవధికి 8.60%, మూడేళ్ల వ్యవధికి 8.70 శాతంగా ఉంది.
ఏమిటీ ఎంసీఎల్ఆర్?
బ్యాంకులు నిధుల సమీకరణకు చేసే వ్యయాల ఆధారంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను నిర్ణయిస్తాయి. అంటే ఈ శాతానికన్నా తక్కువగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వీల్లేదు. రోజు, నెల, 3, 6, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వ్యవధికి ఈ వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. ఈ విధానం 2016 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తీసుకున్న గృహరుణాలు, తనఖా రుణాలు, కార్పొరేట్ రుణాలు ఎక్కువగా దీని పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం గృహరుణాలు చాలావరకూ రెపో ఆధారిత వడ్డీ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) మారాయి. అంటే రెపోరేటు ఆధారంగా ఇది మారుతుంటుంది. ఈ విధానానికి మారని వారికి ఎంసీఎల్ఆర్ వర్తిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.