వడ్డీ రేట్లు మరింత పైకి
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేస్తోంది.
ఈనాడు, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపోరేటును పెంచుతున్నందున, బ్యాంకులకు నిధుల లభ్యత తగ్గుతోంది. ఫలితంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేటును 100-150 బేసిస్ పాయింట్ల మేరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది.
నిధుల సమీకరణకు: డిపాజిట్ల ద్వారా డబ్బును సేకరించడం, రివర్స్ రెపో లేదా స్టాండింగ్ డిపాజిట్లో ఉన్న డబ్బును వెనక్కి తీసుకోవడం ద్వారా రుణాల జారీకి అవసరమైన నిధులు సమీకరించేందుకు బ్యాంకులు ఇప్పటి వరకు ప్రయత్నించాయి. దీంతో రుణ రేట్లను పెద్ద ఎత్తున పెంచే విషయంలో బ్యాంకులకు అంత ఒత్తిడి ఎదురవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు దాదాపు రూ.5లక్షల కోట్లను రివర్స్ రెపో ఖాతాల నుంచి వెనక్కి తీసుకుని, రుణాల జారీకి వినియోగించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ అవకాశం కనిపించడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులు నిధుల వ్యయం ఆధారిత రుణరేట్లను (ఎంసీఎల్ఆర్) పెంచకతప్పకపోవచ్చనే అంచనాలున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో 2.50% పెంపు
ఈ ఆర్థిక సంవత్సరం మే నుంచి ఆర్బీఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది. కేంద్ర బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ రుణ రేట్లను నిధుల సమీకరణ వ్యయాల ఆధారంగా ప్రతి నెలా సవరిస్తూ ఉంటాయి. ముందస్తు పన్ను, జీఎస్టీ చెల్లింపులు తదితర కారణాల వల్ల వచ్చే కొన్ని వారాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో, ద్రవ్య లభ్యత కఠినతరం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. దీర్ఘకాలిక రెపో వేలం, స్వల్పకాలిక బాండ్లు, ట్రెజరీ బిల్లులను బహిరంగంగా మార్కెట్లో కొనుగోలు వంటి విభిన్న సాధనాలను ఉపయోగించి ద్రవ్య లభ్యత విషయంలో బ్యాంకింగ్ వ్యవస్థకు ఆర్బీఐ మద్దతు ఇస్తుందని ఫిచ్ గ్రూపు కంపెనీ అంచనా వేస్తోంది. నగదు లభ్యత తక్కువగా ఉంటుందని భావిస్తున్న స్వల్ప కాల వ్యవధిలో, బలహీన సంస్థలకు సమస్యాత్మకంగా మారొచ్చని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. 2023-24లో పాలసీ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థ వడ్డీ రేట్ల విషయంలో కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది.
రుణ రేట్లు పెంచిన ఎస్బీఐ
ఎస్బీఐ బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 70 బేసిస్ పాయింట్ల మేరకు పెంచి, 14.85% చేసినట్లు ప్రకటించింది. కొత్త రేటు నేటి నుంచి అమల్లోకి రానుంది. బేస్ రేటునూ 70 బేసిస్ పాయింట్లు పెంచి, 10.10 శాతానికి చేర్చింది. ఎంసీఎల్ఆర్ను మాత్రం పెంచలేదు. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.50%, రెండేళ్ల వ్యవధికి 8.60%, మూడేళ్ల వ్యవధికి 8.70 శాతంగా ఉంది.
ఏమిటీ ఎంసీఎల్ఆర్?
బ్యాంకులు నిధుల సమీకరణకు చేసే వ్యయాల ఆధారంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను నిర్ణయిస్తాయి. అంటే ఈ శాతానికన్నా తక్కువగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వీల్లేదు. రోజు, నెల, 3, 6, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వ్యవధికి ఈ వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. ఈ విధానం 2016 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తీసుకున్న గృహరుణాలు, తనఖా రుణాలు, కార్పొరేట్ రుణాలు ఎక్కువగా దీని పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం గృహరుణాలు చాలావరకూ రెపో ఆధారిత వడ్డీ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) మారాయి. అంటే రెపోరేటు ఆధారంగా ఇది మారుతుంటుంది. ఈ విధానానికి మారని వారికి ఎంసీఎల్ఆర్ వర్తిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది. -
400 మంది ఇంజినీర్ల నియామకాలు: కోటక్ బ్యాంక్
ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని బ్యాంక్ భావిస్తోంది. -
10 కిలోల పెంపుడు జంతువు క్యాబిన్లోనే
తమ దేశీయ విమానాల క్యాబిన్లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
తమ వెబ్సైట్లో వేసవి విహారం కోసం శోధించిన వాటి వివరాలను ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్