2024 మార్చి కల్లా 1,000 నియామకాలు
వచ్చే ఏడాది మార్చి చివరినాటికి సుమారు 1,000 మందిని నియమించుకునే యోచనలో ఉన్నామని ఆకాశ ఎయిర్ వెల్లడించింది.
సంవత్సరాంతం నాటికి ‘మూడంకెల్లో’ విమానాల ఆర్డరు
ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దుబే
దిల్లీ: వచ్చే ఏడాది మార్చి చివరినాటికి సుమారు 1,000 మందిని నియమించుకునే యోచనలో ఉన్నామని ఆకాశ ఎయిర్ వెల్లడించింది. తద్వారా మొత్తం సిబ్బందిని 3,000 మందికి పెంచుకోవాలని అనుకుంటోంది. అలాగే మరిన్ని విమానాల సంఖ్యను, సర్వీసులను కూడా పెంచుకోనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ వినయ్ దుబే తెలిపారు. ఆకాశ ఎయిర్ ఏడు నెలల క్రితమే (2022 ఆగస్టు 7న) కార్యకలాపాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి కల్లా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఏయే విదేశీ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించాలో ఖరారు చేసే పనిలో ఉన్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుబే తెలిపారు. ఈ సంవత్సరం చివరినాటికి ‘మూడంకెల్లో’ విమానాలకు ఆర్డర్లు ఇస్తామని అన్నారు. కాగా.. ఇప్పటికే 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆకాశ ఎయిర్ ఆర్డరు పెట్టింది. ఇందులో 19 విమానాలు ఇప్పటికే సరఫరా అయ్యాయి. 20వ విమానం ఏప్రిల్లో డెలివరీ అవుతుంది. ఆ తర్వాత విదేశీ సర్వీసులను నడిపేందుకు కూడా సంస్థ అర్హత సాధిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 9 విమానాలు చేరుతాయి. దీంతో మొత్తం విమానాల సంఖ్య 28కు పెరుగుతుంది. మొత్తం 72 బోయింగ్ విమానాల డెలివరీ 2027 ప్రారంభం కల్లా పూర్తయ్యే అవకాశం ఉందని దుబే తెలిపారు. ‘ప్రస్తుతం ప్రతి రోజు 110 విమాన సర్వీసులను నడిపిస్తున్నాం. వేసవికాల సీజను ముగిసే నాటికి రోజుకు 150 విమాన సర్వీసులను నడిపిస్తాం. ప్రస్తుతానికి మార్కెట్ వాటాకు సంబంధించి ఎలాంటి లక్ష్యాలు లేవు. ఫలానా స్థానం కోసం కూడా మేం పోటీపడటం లేదు. ప్రయాణికులను, ఉద్యోగులను సంతృప్తిపర్చడమే ప్రస్తుతం మేం పెట్టుకున్న లక్ష్యం. ఆ దిశగానే మేం పనిచేస్తున్నామ’ని దుబే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.