లాభాలు కొనసాగే అవకాశం
లాభాలను మార్కెట్లు ఈ వారమూ కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50 సూచీ కీలక 18,450 పాయింట్ల స్థాయిని అధిగమించడం ఇందుకు దోహదం చేయొచ్చని అంటున్నారు.
ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ సమావేశంపై దృష్టి
కార్పొరేట్ ఫలితాల ఆధారంగా షేర్ల కదలికలు
వాహన, బ్యాంకు స్క్రిప్లకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్ మార్కెట్ ఈ వారం
లాభాలను మార్కెట్లు ఈ వారమూ కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50 సూచీ కీలక 18,450 పాయింట్ల స్థాయిని అధిగమించడం ఇందుకు దోహదం చేయొచ్చని అంటున్నారు. నిఫ్టీకి 18,400 వద్ద తక్షణ మద్దతు, 18,520 వద్ద నిరోధం కనిపించొచ్చన్నది సాంకేతిక నిపుణుల అంచనా. గతవారం ధోరణి కొనసాగితే.. కొత్త గరిష్ఠాలు కష్టమేమీ కాకపోవచ్చని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. అయితే విదేశీ, దేశీయ సంస్థాగత మదుపుదార్లు ఒకే సమయంలో నికర కొనుగోలుదార్లుగా ఉంటే, లాభాల స్వీకరణకూ అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఐటీ, ఎఫ్ఎమ్సీజీ రంగాలకు తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ను ముందుండి నడిపించొచ్చని అంటున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల డైరెక్టర్లతో ఆర్బీఐ గవర్నర్ నేడు సమావేశం కానున్న నేపథ్యంల, మదుపర్ల దృష్టి అటువైపు ఉండొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు..
* సిమెంటు రంగ షేర్లు స్తబ్దుగా కదలాడొచ్చు. బలహీన ధరల నుంచి రికవరీ కావడానికి ఈ రంగం ప్రయత్నిస్తోంది. ముడిపదార్థాల అధిక ధరలు ఇబ్బంది పెడుతున్నాయి.
* ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి చమురు ఉత్పత్తి కంపెనీల షేర్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల చలనాల ఆధారంగా కదలాడనున్నాయి. ఒపెక్ తదుపరి సమావేశం జూన్ 4న జరగనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు రిటైల్ ధరల నుంచి సంకేతాలందుకోవచ్చు.
* ఎంపిక చేసిన టెలికాం షేర్లలో చలనాలు కనిపించొచ్చు. తాజా వినియోగదారు గణాంకాల ప్రభావం కొనసాగొచ్చు. వరుసగా 12వ నెలైన మార్చిలో రిలయన్స్ జియో నికరంగా 30.5 లక్షల మంది వినియోగదార్లను జత చేసుకుంది.
* వాహన షేర్లు లాభాలందుకోవచ్చు. స్వల్ప, మధ్య కాలానికి ఈ రంగంపై సానుకూల భావనలున్నాయి. నిఫ్టీ ఆటో సూచీ మార్కెట్ను మించి రాణించొచ్చన్న అంచనాలున్నాయి.
* అమెరికా టెక్ షేర్లు పుంజుకోవడంతో పాటు సానుకూల అంచనాల నేపథ్యంలో, మన ఐటీ షేర్లూ లాభాలను కొనసాగించొచ్చు. మైక్రోసాఫ్ట్ తన విండోస్ కోపైలట్ను ప్రకటించడం టెక్ షేర్లపై ప్రభావం చూపింది.
* అమెరికా రుణ పరిమితి పెంపుపై చర్చలు సానుకూలంగా ఉన్నాయన్న వార్తలు, లోహ షేర్లకు ఉపకరించొచ్చు.
* కొద్ది రోజులుగా రాణిస్తున్న ఔషధ షేర్లు స్థిరీకరణకు గురికావొచ్చు. నిఫ్టీ ఫార్మా సూచీ ఒక వేళ 12,800 స్థాయిని అధిగమిస్తే మాత్రం 13,100 పాయింట్ల దాకా పెరగొచ్చు. లేదంటే 12,400 వైపునకు దిద్దుబాటుకు గురికావొచ్చు. సన్ఫార్మా, అరబిందో, ఇప్కా ల్యాబ్ ఫలితాల ప్రభావమూ కనిపించొచ్చు.
* ఎఫ్ఎమ్సీజీ షేర్లు రాణించొచ్చు. ఈ రంగ సూచీ ఈ నెలలో జీవనకాల గరిష్ఠాలను తాకుతూనే ఉంది. 52000 వద్ద నిరోధం, 49400 వద్ద మద్దతు కనిపిస్తోంది.
* బ్యాంకు షేర్లు తమ లాభాలను కొనసాగించొచ్చు. నిఫ్టీ బ్యాంక్కు 43,500 వద్ద మద్దతు, 44,500 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సానుకూల ధోరణితో ముందుకెళ్లొచ్చు.
* బలమైన ఫలితాల మధ్య యంత్రపరికరాల షేర్లు స్వల్పకాలంలో మెరుగ్గా చలించొచ్చు. అన్ని కంపెనీలు ఫలితాలను వెల్లడించాకే, స్పష్టమైన దిశను అంచనా వేయగలమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.