ITC - GST: ఐటీసీ అదనపు క్లెయిమా.. ఎందుకో చెప్పాల్సిందే
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టంలో కొత్త నిబంధనలు జతచేసే అంశంపై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదనంగా క్లెయిమ్ చేసుకున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)కు, ఖజానాకు అదనంగా జమ చేసిన మొత్తానికి కారణాలను కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు వివరించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జీఎస్టీ చట్టంలో కొత్త నిబంధనలు
రేపు మండలి 50వ సమావేశంలో నిర్ణయం
దిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టంలో కొత్త నిబంధనలు జతచేసే అంశంపై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదనంగా క్లెయిమ్ చేసుకున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)కు, ఖజానాకు అదనంగా జమ చేసిన మొత్తానికి కారణాలను కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు వివరించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జీఎస్టీఆర్-2బీలో ఉండే ఐటీసీ మొత్తంతో పోలిస్తే, జీఎస్టీఆర్-3బీ రిటర్న్లో పొందిన ఐటీసీకి భారీ వ్యత్యాసం ఉంటే.. సంబంధిత వ్యక్తికి పోర్టల్పై సమాచారం ఇస్తారు. ఇందుకు గల కారణాలను వివరించాలి.. లేదా పొందిన అదనపు ఐటీసీని వడ్డీతో తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశించనున్నారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారులతో కూడిన న్యాయ కమిటీ ఈ నిబంధన పెట్టేందుకు సుముఖంగా ఉందని సమాచారం. ఈ వ్యత్యాసం 20 శాతం లేదా రూ.25 లక్షల కంటే అధికంగా ఉంటే కొత్త నిబంధనలు అమలు చేయాలని కమిటీ సూచించింది. ఈనెల 11న (రేపు) జరగనున్న జీఎస్టీ మండలి 50వ సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జీఎస్టీఎన్తో ఈడీ సమాచార పంపిణీ: జీఎస్టీ నెట్వర్క్తో సమాచారాన్ని పంచుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం మనీలాండరింగ్ చట్టంలోని నిబంధనలను సవరించింది. జీఎస్టీ ఎగవేతలను రికవరీ చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. రిటర్నులు, పన్ను ఫైలింగ్, ఇతర అంశాలతో పాటు జీఎస్టీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని జీఎస్టీఎన్ నిర్వహిస్తోంది. 2002 మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల సవరణతో.. ఈడీతో సమాచారాన్ని పంచుకునే సంస్థల జాబితాలో జీఎస్టీఎన్ను చేర్చారు. పీఎంఎల్ఏ కింద జీఎస్టీఎన్ను చేర్చడంతో భారీ మొత్తంలో పన్ను ఎగవేస్తున్న వారిని గుర్తించొచ్చని, వారి నుంచి బకాయిలు రాబట్టుకోవచ్చని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం