సంక్షిప్త వార్తలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అవంతీ ఫీడ్స్ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,278 కోట్ల ఆదాయాన్ని, రూ.82.73 కోట్ల నికర లాభాన్నీ నమోదు చేసింది.
అవంతీ ఫీడ్స్ లాభం రూ.82.73 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అవంతీ ఫీడ్స్ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,278 కోట్ల ఆదాయాన్ని, రూ.82.73 కోట్ల నికర లాభాన్నీ నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.1,322.09 కోట్లు, నికర లాభం రూ.67.45 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొత్తం ఆదాయం రూ.2,832.14 కోట్లు, నికర లాభం రూ.197.47 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో సంస్థ ఆదాయం రూ.2,891.40 కోట్లు, నికర లాభం రూ.140.24 కోట్లుగా నమోదయ్యాయి. సంస్థకు అనుబంధంగా అవంతీ పెట్ కేర్ను జులైలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
పెరిగిన విజయ డయాగ్నోస్టిక్ లాభం
ఈనాడు, హైదరాబాద్: రోగ నిర్థారణ సేవలను అందించే విజయ డయాగ్నోస్టిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.138.9 కోట్ల ఆదాయం, రూ.33.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాలంలో సంస్థ రూ.120.7 కోట్ల ఆదాయంపై రూ.23.3 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. దీంతో పోలిస్తే ఈసారి ఆదాయం 15 శాతం, నికర లాభం 42.9 శాతం చొప్పున పెరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ సేవలను విస్తరిస్తున్నట్లు విజయ డయాగ్నోస్టిక్ తెలిపింది. గత నెలలో ఒక స్టాండలోన్ కేంద్రాన్ని మహబూబ్నగర్లో ప్రారంభించినట్లు వెల్లడించింది. బీ2సీ విభాగం నుంచే 95 శాతం ఆదాయాలు వచ్చినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సుప్రిత రెడ్డి తెలిపారు. కొవిడ్ ఏతర పరీక్షల నుంచి వచ్చిన ఆదాయాల్లో 18 శాతం వృద్ధి కనిపించిందని పేర్కొన్నారు. కోల్కతా కేంద్ర వృద్ధిపై సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలకు సంబంధించి ‘అన్నీ ఒకే చోట’ లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు.
జీఓసీఎల్ ఆదాయం రూ.223 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: హిందుజా గ్రూపు కంపెనీ జీఓసీఎల్ కార్పొరేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.223.42 కోట్ల ఆదాయాన్ని, రూ.15.71 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.318.99 కోట్లు, నికర లాభం రూ.40.37 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఆదాయం రూ.482 కోట్లు, నికర లాభం రూ.28 కోట్లుగా నమోదయ్యాయి. మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం, ముడి సరకు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ప్రభావం సమీక్షా త్రైమాసిక పనితీరుపై పడినా, స్థిరమైన వృద్ధి సాధించినట్లు సంస్థ ఎండీ, సీఈఓ పంకజ్ కుమార్ తెలిపారు. వినియోగదారుల అవసరాలకు తగ్గ ఉత్పత్తులు తీసుకొస్తున్నామని, దీర్ఘకాలంలో వృద్ధికి ఇది తోడ్పడుతుందన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, అంతరిక్షం, రక్షణ రంగాలకూ విస్తరిస్తున్నట్లు వివరించారు. చంద్రయాన్ మిషన్లోనూ తమ ఉత్పత్తులను వినియోగించినట్లు తెలిపారు. రాబోయే రెండేళ్ల కాలానికి సంస్థ చేతిలో రూ.1,100 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని తెలిపారు.
పవర్గ్రిడ్ డివిడెండ్ 40 శాతం
దిల్లీ: పవర్గ్రిడ్ కార్పొరేషన్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.3,781.42 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.3,650.29 కోట్లతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.11,349.44 కోట్ల నుంచి రూ.11,530.43 కోట్లకు పెరిగింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.4 చొప్పున (40 శాతం) మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. డిసెంబరు 6న డివిడెండ్ చెల్లించనుంది.
పెరిగిన నెట్లింక్స్ లాభం
ఈనాడు, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ, ఐటీ ఇంజినీరింగ్ సేవలను అందించే నెట్వర్క్ ఫ్లాట్ఫాం నెట్లింక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.7.46 కోట్ల ఆదాయాన్ని, రూ.1.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.6.4 కోట్లు, నికర నష్టం రూ.7.1 లక్షలుగా ఉంది. వీటితో పోలిస్తే ఈసారి ఆదాయం 16.54%, లాభం 2264% పెరిగాయి.
న్యూలాండ్ లేబొరేటరీస్ ఆదాయం రూ.421 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: న్యూలాండ్ లేబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.420.8 కోట్ల ఆదాయంపై రూ.89.1 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.293.9 కోట్లు, నికర లాభం రూ.38.3 కోట్లుగా ఉన్నాయి. వీటితో పోలిస్తే ఈసారి ఆదాయం 43.2 శాతం, నికర లాభం 132.3 శాతం మేర పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి ఆదాయం రూ.785.8 కోట్లు, లాభం రూ.151.3 కోట్లుగా ఉన్నాయి. కొన్నేళ్లుగా సీఎంఎస్ విభాగంలో చేస్తున్న కృషికి ఈ ఫలితాలు నిదర్శనమని సంస్థ వైస్ ఛైర్మన్, సీఈఓ సుచేత్ దావులూరి తెలిపారు. వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సహర్ష్ దావులూరి మాట్లాడుతూ.. నిధుల సమస్య ఉన్నప్పటికీ సీఎంఎస్ (కస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్) ప్రాజెక్టులు రెట్టింపు వృద్ధితో సాగుతున్నాయన్నారు. సామర్థ్య విస్తరణ, వినియోగదారులకు అవసరమైన సేవలను అందించేందుకు పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
లిఖిత ఇన్ఫ్రా లాభం రూ.15.57 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: సెప్టెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదిక ప్రకారం.. లిఖిత ఇన్ఫ్రా రూ.108.60 కోట్ల ఆదాయంపై రూ.15.57 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే మూడు నెలల్లో కంపెనీ ఆదాయం రూ.82.96 కోట్లు, లాభం రూ.14.60 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సంస్థ రూ.198.80 కోట్ల ఆదాయం, రూ.31.49 కోట్ల లాభం నమోదు చేసింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణరేట్ల పెంపు
ముంబయి: కొన్ని కాలావధుల రుణాలపై వడ్డీరేట్లను 0.05 శాతం పెంచినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. తాజా మార్పుల ప్రకారం నిధుల వ్యయం ఆధారిత రుణరేటు (ఎంసీఎల్ఆర్) ఓవర్నైట్ రేటు 8.60 శాతం నుంచి 8.65 శాతానికి, మూడేళ్ల కాలపరిమితి రేటు 9.25 శాతం నుంచి 9.30 శాతానికి పెరిగింది. ఏడాది కాలపరిమితి రుణాలకు మార్పు చేయకుండా 9.20 శాతంగానే ఉంచింది.
అహేడ్లో 1,000 ఉద్యోగాలు
దిల్లీ: అమెరికా (షికాగో) కేంద్రంగా కార్యకలాపాలు సాగించే క్లౌడ్, డేటా, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ అహేడ్ మన దేశంలో వచ్చే 12 నెలల్లో 1,000 మందికి పైగా ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. గురుగ్రామ్లో ఈ కంపెనీ సర్వీస్ డెలివరీ కార్యాలయాన్ని ప్రారంభించింది. అమెరికా వెలుపల ఈ సంస్థ ఏర్పాటు చేసిన తొలి కార్యాలయం ఇదే. ‘అమెరికాకు బయట మా తొలి డెలివరీ కేంద్రాన్ని భారత్లో ఏర్పాటు చేయడం ద్వారా దేశీయంగా విన్నూతత, డిజిటల్ వృద్ధికి ఉత్ప్రేరకంగా నిలుస్తాం. దేశీయంగా మా సర్వీస్ డెలివరీని పెంచడానికి అందుబాటులో ఉన్న అసాధారణ సాంకేతిక నైపుణ్యం కలిగిన 1,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామ’ని అహేడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ డేనియల్ అడమానీ తెలిపారు.
కాఫీ బోర్డు ఛైర్మన్గా ఎం.జె.దినేశ్
దిల్లీ: కాఫీ బోర్డు ఛైర్మన్గా ఎం.జె.దినేశ్ను మూడేళ్ల కాలానికి నియమిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పోస్టు కొంత కాలంగా ఖాళీగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే ఈ బోర్డులో ఛైర్మన్, సెక్రటరీ-సీఈఓతో పాటు కాఫీకి సంబంధించిన వేర్వేరు వర్గాల నుంచి 31 మంది సభ్యులుంటారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లేదా మూడేళ్ల కాలం ముగిసే వరకు.. ఏది ముందైతే ఆ ప్రాతిపాదికన దినేశ్ కొనసాగుతారని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్