ఐపీఓకి జెమిని ఎడిబుల్స్
యుద్ధం నేపథ్యంలో, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు పువ్వు (సన్ఫ్లవర్) నూనె దిగుమతిపై ప్రభావం పడటం వల్లే, దేశీయంగా వంట నూనెల ధరలు పెరిగాయని జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా (జీఈఎఫ్ ఇండియా) మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌధ్రి అన్నారు.
ఈనాడు, హైదరాబాద్: యుద్ధం నేపథ్యంలో, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు పువ్వు (సన్ఫ్లవర్) నూనె దిగుమతిపై ప్రభావం పడటం వల్లే, దేశీయంగా వంట నూనెల ధరలు పెరిగాయని జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా (జీఈఎఫ్ ఇండియా) మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌధ్రి అన్నారు. అయితే రష్యా, అర్జెంటైనా నుంచి దిగుమతులు పెరిగినందున, నూనె ధరలు అదుపులోకి వస్తున్నాయని తెలిపారు. ఇండొనేషియా నుంచి ముడిపామాయిల్ ఎగుమతులు ప్రారంభం కావడంతో, పామాయిల్ ధర తగ్గే అవకాశం ఉందని, శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రదీప్ తెలిపారు. తాము ఉత్పత్తి చేస్తున్న ఫ్రీడం రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ 2022 నాటికి మార్చి 31 నాటికి అమ్మకాల పరంగా మొదటి స్థానంలో నిలిచినట్లు నీల్సన్ ఐక్యూ సర్వేలో తేలిందని పేర్కొన్నారు.
పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.2,500 కోట్లు: గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.10,500 కోట్ల టర్నోవర్ సాధించిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్ల లక్ష్యాన్ని విధించుకున్నట్లు పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించేందుకు ఇప్పటికే సెబీకి డీఆర్హెచ్పీ దాఖలు చేసినట్లు ప్రదీప్ వెల్లడించారు. తెలంగాణలో రోజుకు 1,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 50 ఎకరాల్లో వంట నూనెల ప్లాంటు ఏర్పాటు చేయబోతున్నామని, దీనికోసం రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రదీప్ వెల్లడించారు. రెండేళ్లలో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ