టీమ్ఇండియా విజయంతో సుందర్ పిచాయ్ దీపావళి.. పాక్ ట్రోల్కు గట్టి కౌంటర్
పాక్పై టీమ్ఇండియా గెలుపు సంబరంతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్ సేనపై పాక్ నెటిజన్ చేసిన విమర్శలకు ఆయన గట్టి సమాధానమిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ మెగా సమరంలో దాయాది పాకిస్థాన్పై టీమ్ఇండియా చిరస్మరణీయ విజయంతో భారతీయులకు దీపావళి పండగ ముందే వచ్చేసింది. గూగుల్ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ కూడా మ్యాచ్ సంబరంతోనే దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆ విషయాన్ని చెబుతూ ఆయన ఓ ట్వీట్ చేయగా.. ఓ పాక్ నెటిజన్ విమర్శించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ విమర్శకుడికి సుందర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
టీ20 ప్రపంచకప్ టోర్నీని భారత్ అద్భుతమైన విజయంతో మొదలుపెట్టింది. మెల్బోర్న్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిపై టీమ్ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ముఖ్యంగా రోహిత్ సేన ఛేదనలో చివరి మూడు ఓవర్లు క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఈ మ్యాచ్ గురించి చెబుతూ సుందర్ పిచాయ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారని ఆశిస్తున్నా. నేను కూడా నిన్న జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లను ఈ రోజు మళ్లీ చూసి దీపావళి వేడుకలు చేసుకున్నా. అద్భుతమైన గేమ్.. టీమ్ఇండియా అత్యద్భుత ప్రదర్శన’’ అని పిచాయ్ రాసుకొచ్చారు.
కాగా.. ఈ ట్వీట్కు పాకిస్థాన్కు చెందిన ఓ నెటిజన్ స్పందిస్తూ రోహిత్ సేనపై విమర్శలు చేసే ప్రయత్నం చేశాడు. ‘‘మీరు(సుందర్ పిచాయ్ను ఉద్దేశిస్తూ) మొదటి మూడు ఓవర్లు చూడాల్సింది’’ అంటూ ఛేదనలో తొలి మూడు ఓవర్లలో టీమ్ఇండియా తడబడిన విషయాన్ని ప్రస్తావించాడు. అయితే అక్కడ నెటిజన్ ఏ జట్టు ఆడిన ఇన్నింగ్స్ అనేది స్పష్టంగా చెప్పకపోవడంతో ఈ ట్రోల్కు సుందర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘అది కూడా చూశా.. భువీ, అర్ష్దీప్ నుంచి అద్భుతమైన బౌలింగ్ స్పెల్’’ అంటూ బదులిచ్చారు.
ఆ తర్వాత సదరు ట్విటర్ యూజర్ తాను టీమిండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నానని మరో ట్వీట్ చేసినప్పటికీ నెటిజన్లు అతడికి చురకలంటించారు. ‘‘అంత గొప్ప వ్యక్తి నీ ట్వీట్కు స్పందించడమే గొప్ప విషయం’’.. ‘‘పిచాయ్ సర్ మీరు సూపర్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.