Import duty: అరుదైన వ్యాధుల చికిత్సలో వినియోగించే ఔషధాలపై దిగుమతి సుంకం మినహాయింపు
Import Duty: వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా మినహాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
దిల్లీ: అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల నిమిత్తం వినియోగించే ఆహారంపై దిగుమతి సుంకాన్ని (Import Duty) పూర్తిగా మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వ్యక్తిగత అవసరాల కోసం చేసుకునే దిగుమతులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మినహాయింపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. వివిధ రకాల క్యాన్సర్ చికిత్సల్లో ఉపయోగించే పెంబ్రోలిజుమాబ్ అనే ఔషధం దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలిపింది. ‘జాతీయ పాలసీ 2021’లో పేర్కొన్న అన్ని అరుదైన వ్యాధుల చికిత్సల్లో ఉపయోగించే మందులపై దిగుమతి సుంకం మినహాయింపు ఉంటుందని పేర్కొంది. కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపును పొందేందుకు కేంద్ర/రాష్ట్ర డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్ లేదా జిల్లా వైద్య అధికారి/జిల్లా సివిల్ సర్జన్ నుంచి పొందిన సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది.
ఇప్పటికే కొన్ని రకాల చికిత్సల్లో ఉపయోగించే మందులకు దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఉంది. అయితే, దాన్ని మరికొన్ని చికిత్సలకూ విస్తరించాలనే డిమాండ్లు ప్రభుత్వానికి అందాయి. ఆ మేరకే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఔషధాలపై 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఉంటుంది. కొన్ని కీలక ఔషధాలపై దాన్ని ఐదు శాతానికి కుదించారు. వెన్నెముక కండరాల క్షీణత, కండరాల బలహీనత వంటి వ్యాధుల చికిత్స కోసం ఉపయోగించే మందులపై ఇప్పటికే పూర్తిగా మినహాయింపు లభిస్తోంది. కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు వార్షిక ఖర్చు సంవత్సరానికి 10 లక్షల నుంచి రూ.1 కోటి కంటే ఎక్కువ అవుతోందని కేంద్రం అంచనా వేసింది. చికిత్స జీవితకాలం ఉండడం వల్ల సామాన్య ప్రజలు ఆ ఖర్చును భరించలేకపోతున్నారని పేర్కొంది. కస్టమ్స్ సుంకం మినహాయింపు వల్ల ఔషధాల వ్యయం గణనీయంగా తగ్గుతుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.