ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అకౌంట్లోకి PF వడ్డీ
PF Interest: ఈపీఎఫ్ వడ్డీ మొత్తాలు సబ్స్క్రైబర్ల ఖాతాల్లో జమ అవుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 8.15 శాతం చొప్పున ఈ మొత్తం జమ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ నిల్వలపై వడ్డీ (PF Interest) మొత్తాలను పీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమ అవ్వగా.. ఇంకా పలువురి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అకౌంట్లలో కనిపించడానికి కాస్త సమయం పడుతుందని ఈపీఎఫ్ఓ ఓ ఎక్స్ యూజర్కు ఇచ్చిన సమాధానంలో పేర్కొంది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ నిల్వలలపై 8.15 శాతం వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఈపీఎఫ్ఓ వడ్డీని ఆయా ఖాతాల్లో జమ చేస్తోంది. ఈపీఎఫ్ వడ్డీ మొత్తం జమ అయ్యిందో లేదో ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి ‘ఫర్ ఎంప్లాయీస్’ సెక్షన్ ఎంచుకోవాలి. అందులో మెంబర్ పాస్బుక్ను ఎంచుకోవాలి. తర్వాత లాగిన్ పేజీలో యూఏఎన్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వడం ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చు.
ఆధార్తో లింక్.. 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్
కేంద్రం తీసుకొచ్చిన ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ వడ్డీ మొత్తం జమ అయ్యిందో లేదో చూసుకోవచ్చు. ఉమాంగ్ యాప్లో ఈపీఎఫ్ సెక్షన్లోకి వెళ్లి.. వ్యూ పాస్బుక్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. కావాలంటే ఇ-పాస్బుక్ను పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!