Layoffs: కొనసాగుతున్న తొలగింపుల పర్వం.. ఈసారి ఐబీఎం, ఎస్ఏపీ
Layoffs: ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో టెక్ కంపెనీలు వ్యయాలను నియంత్రించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
న్యూయార్క్: ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రఖ్యాత టెక్ కంపెనీలు ఐబీఎం (IBM), జర్మనీకి చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం ఎస్ఏపీ (SAP) సైతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఐబీఎం 3,900 మందిని ఇంటికి పంపనుండగా.. ఎస్ఏపీ 3,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు తెలిపింది.
అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో లక్ష్యాలను అందుకోలేకపోయామని ఐబీఎం (IBM) తెలిపింది. ఆదాయాలు పడిపోయినట్లు పేర్కొంది. మరోవైపు పెట్టుబడుల ఉపసంహరణలు కూడా కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో వ్యయాలను నియంత్రించడం కోసం తొలగింపులు తప్పడం లేదని వెల్లడించింది. అయినప్పటికీ.. కొన్ని ముఖ్యమైన విభాగాల్లో నియామకాలు కూడా కొనసాగుతాయని తెలిపింది. 2022లో కంపెనీ 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ, అది 9.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నిర్వహణ మూలధన వ్యయాలు అంచనాలను మించడమే ఆదాయం తగ్గడానికి కారణమని ఐబీఎం తెలిపింది.
మరోవైపు తమ కీలక వ్యాపారాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా కొన్ని ప్రాజెక్టులను పునర్వ్యవస్థీకరిస్తున్నామని ఎస్ఏపీ (SAP) తెలిపింది. ఈ క్రమంలోనే కొంతమంది ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని వెల్లడించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2.5 శాతానికి సమానమైన సిబ్బందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో 1,20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.