Kia Cars: కియా సెల్టోస్‌, కారెన్స్‌ ధరల పెంపు.. అక్టోబర్‌ 1 నుంచి కొత్త ధరలు

Kia Cars: ఎంట్రీ-లెవెల్‌ మోడల్‌ అయిన సోనెట్‌ (Kia Sonet) ధరను మాత్రం కియా ఇండియా సవరించలేదు.

Updated : 21 Sep 2023 15:53 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) కొన్ని కార్ల మోడళ్ల ధరలను పెంచనుంది. కొత్త ధరలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సెల్టోస్‌ (Kia Seltos), కారెన్స్‌ ధర (Kia Carens)లను రెండు శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంట్రీ-లెవెల్‌ మోడల్‌ అయిన సోనెట్‌ (Kia Sonet) ధరను మాత్రం సవరించలేదు. కియా ఇండియా (Kia India) చివరిసారి ఈ ఏడాది ఏప్రిల్‌లో ధరలను పెంచింది. కొత్త కర్బన ఉద్గారాలకు అనుగుణంగా కార్లను అప్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో అప్పుడు ధరలను సవరించింది. ముడి సరకుల ధరలు పెరగడంతో పాటు కొత్త సెల్టోస్‌లో అదనపు ఫీచర్ల కారణంగానే తాజాగా ధరలను పెంచాల్సి వస్తోందని కియా ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగాధిపతి హర్దీప్‌ ఎస్‌ బ్రార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని