Cyber scam: కొరియర్ స్కామ్.. లక్షల్లో దోపిడీ.. ఎలా జరుగుతున్నాయంటే?
cyber scam: సైబర్ నేరగాళ్లు రోజుకో వేషం మార్చి దోచేస్తున్నారు. కొత్తగా కొరియర్ పేరుతో మోసాలకు తెరతీస్తున్నారు. అయితే వీరు ఎలా డబ్బును దోచుకుంటున్నారు. వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో చూద్దాం..
ఇంటర్నెట్డెస్క్: సైబర్ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు పూటకో వేషం మార్చి దోచుకుంటున్నారు. కొత్త కొత్త పంథాలు అనుసరిస్తూ.. లక్షల్లో ఎగరేసుకుపోతున్నారు. వీడియోకు లైక్ చేస్తే డబ్బులొస్తాయని.. లింక్పై క్లిక్ చేస్తే ప్రైజ్ గెలుచుకోవచ్చంటూ.. ఇన్నాళ్లూ రకరకాలుగా మోసాలకు పాల్పడిన వారు.. ఇప్పుడు కొరియర్ పేరిట (courier scam) కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. ఇంతకీ ఏమిటీ మోసం? ఎలా చేస్తున్నారు?
ఇటీవల పీహెచ్డీ చదువుతున్న బెంగళూరుకు చెందిన విద్యార్థి ఒకరు ఈ కొరియర్ స్కామ్కు బలయ్యాడు. ఏకంగా రూ.1,34,650 పోగొట్టుకున్నాడు. ‘నా పేరున మాదకద్రవ్యాలున్న కొరియర్ వచ్చిందంటూ కాల్ వచ్చింది. సంబంధిత అధికారులకు కాల్ కనెక్ట్ చేసి వెంటనే స్కైప్ కాల్ కనెక్ట్ కావాలన్నారు. ఆర్బీఐ, సీబీఐకి చెందిన కొన్ని పత్రాలను చూపించారు. అలాగే బ్యాంక్ సంబంధిత వివరాలు తీసుకొని డబ్బుకట్టాలని తెలిపారు. వారు నార్కోటిక్ అధికారులుగా నమ్మించి ‘మత్తుపదార్థాలు పంపిణీ చేస్తావా?’ అంటూ బెదిరించారు. దీంతో భయం వేసి వెంటనే డబ్బు పంపించా’ అంటూ ఆ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఘటనలే ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. అచ్చం ఇలాంటి సంఘటన గురించే జెరోధా (Zerodha) సీఈఓ నితిన్ కామత్ (Nithin Kamath) సామాజిక మాధ్యమం ద్వారా పంచున్నారు.
అసలేంటీ స్కామ్?
ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వాళ్లు ముఖ్యంగా యువకులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. మాదకద్రవ్యాలు లేదా నిషిద్ధ పదార్థాలు ఉన్న కొరియర్లు మీ పేరుతో విదేశాలకు వెళ్తున్నాయని సమాచారం ఇస్తారు. మత్తుపదార్థాలు అని వినగానే చాలా మంది భయపడిపోతారు. సరిగ్గా దీన్నే వారు ఆసరాగా చేసుకుంటున్నారు. పేరూ వివరాలూ ధ్రువీకరించుకున్నాక నార్కోటిక్ విభాగానికి చెందిన అధికారులతో మాట్లాడటానికి వీడియోకాల్ జాయిన్ కావాలని చెబుతారు. ఆ తర్వాత మాటలతో మభ్యపెడతారు. బాధితుల నుంచి ఆధార్, బ్యాంక్ వివరాలు సేకరిస్తారు. వెరిఫికేషన్ కోసం అంటూ నగదు పంపాలని కోరతారు. ఆ సొమ్మంతా తిరిగి అకౌంట్కు జమ అవుతుందని నమ్మిస్తారు. ఇక బాధితులు డబ్బులు వేశాక ఇక అంతా గప్చుప్! ఆ సొమ్ముతో జారుకుంటారు. తొలుత భయపెట్టి.. ఆ భయం నుంచి కోలుకునేలోపే సొమ్మును దోచేస్తున్నారు. ఇలా చాలా మంది పెద్ద మొత్తంలో డబ్బును పోగొట్టుకుంటున్నారు.
అలాంటి కాల్స్తో జాగ్రత్త..!
- కొరియర్ సర్వీసులు లేదా చట్టపరమైన సంస్థల నుంచి ఎటువంటి కాల్స్ వచ్చినా వెంటనే సంబంధిత అధికారుల నుంచే వచ్చిందో లేదో అన్న విషయాన్ని ధ్రువీకరించుకోవాలి.
- మీకు అందిన సమాచారంలో ఎటువంటి అనుమానం ఉన్నా కొరియర్ సంస్థలకే ఫోన్ చేయడం మంచిది.
- ఆధార్, బ్యాంక్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఫోన్ల ద్వారా ఇతరులతో పంచుకోకపోవడమే ఉత్తమం.
- సైబర్ మోసగాళ్లు తొందర పెడుతుంటారు. వెంటనే డబ్బులు పంపాలంటూ హెచ్చరిస్తుంటారు. ఇలాంటి సమయంలోనే విచక్షణతో వ్యవహరించండి.
- ఒకవేళ మీకు సైబర్ దాడి ఎదురైతే 155260 నంబర్కు లేదా cybercrime.gov.in.వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
PIN: పుట్టిన రోజు, ఫోన్ నంబర్, ‘‘1234’’, ‘‘0000’’.. ఇలా సులభమైన పిన్లను సెట్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లే. -
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
యాపిల్ నుంచి రాబోయే ఉత్పత్తులకు సంబంధించి తాజాగా కొన్ని లీకులు బయటికొచ్చాయి. ఇందులో ఎస్ఈ4 రాబోయే తేదీ కూడా రివీల్ అయ్యింది. -
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
Moto Edge 50 Fusion: 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో మోటో మరో కొత్త ఫోన్ను భారత్లో విడుదల చేసింది. -
₹15 వేల్లోపు ఐకూ కొత్త ఫోన్.. 3ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్
iQOO Z9x: ఐకూ మూడు వేరియంట్లతో కొత్త 5జీ ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి వెయ్యి రుపాయలు డిస్కౌంట్ అందించనుంది. -
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
Android 15: గూగుల్ I/O 2024 సదస్సులో గూగుల్ తమ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్లను ప్రకటించింది. బీటా 2 వెర్షన్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
Google I/O: ఏఐ మోడల్ జెమినీని అప్గ్రేడ్ చేయటంతో పాటు వీడియోతో లెన్స్ సెర్చ్, సర్కిల్తో లెక్కల్లో సాయం, జీమెయిల్లో జెమినీ ఫీచర్స్ వంటి కొత్త అప్డేట్లను గూగుల్ తమ వార్షిక సదస్సులో ప్రకటించింది. -
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
Tata Play: డీటీహెచ్ కస్టమర్లకు సైతం ఓటీటీ ప్రయోజనాలను అందించేందుకు టాటా ప్లే సిద్ధమైంది. అందుకోసం అమెజాన్ ప్రైమ్తో చేతులు కలిపింది. -
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
GPT-4o: ఓపెన్ఏఐ కొత్త చాట్జీపీటీ వెర్షన్ను విడుదల చేసింది. దీంట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ తమ జెమిని కొత్త వెర్షన్ను ప్రకటించనున్న తరుణంలో ఓపెన్ఏఐ దీన్ని తీసుకురావడం గమనార్హం. -
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ ఇటీవల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటి ప్రయోజనాలు సహా పూర్తి వివరాలు చూద్దాం... -
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
Apple: ఐఫోన్ బ్యాటరీ లైఫ్ను మెరుగుపర్చేందుకు యాపిల్ కొన్ని టిప్స్ను అందించింది. వాటిపై ఓ లుక్కేయండి. -
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్ను తీసుకురానుంది. -
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
Amazon Fire TV Stick: అమెజాన్ కొత్త ఫైర్ స్టిక్ను లాంచ్ చేసింది. 4కె సపోర్ట్తో ఇది వస్తోంది. -
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
Moto: 50dB, 46dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కు సపోర్ట్ చేసే రెండు కొత్త ఇయర్బడ్స్ను మోటో భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. -
యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, పెన్సిల్.. ధర, విశేషాలు ఇవీ..
Apple Let Loose Event 2024: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ లెట్ లూజ్ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, యాపిల్ పెన్సిల్ ప్రోలను ఆవిష్కరించింది. -
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
Google Wallet: టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపర్చుకునేందుకు వీలుగా గూగుల్ డిజిటల్ వాలెట్ను భారత్లో విడుదల చేసింది. -
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్లో విడుదలైంది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో కొత్తగా నాలుగు ఫీచర్లను యాడ్ చేసింది. అవేంటో చూసేయండి. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది. -
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
Noise Pop Buds: నాయిస్ మరో ట్రూవైర్లెస్ ఇయర్ఫోన్స్ను భారత్లో విడుదల చేసింది. క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి.