Saidabad: హంతకుడు ఎక్కడ?రాజు కోసం జల్లెడ పడుతున్న ప్రత్యేక బృందాలు
సైదాబాద్ ఠాణా పరిధిలోని ఆరేళ్ల బాలికను పైశాచికంగా హత్యాచారం చేసి పారిపోయిన రాజును పట్టుకునేందుకు రాజధాని నగరాన్ని వేలమందితో కూడిన ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. మద్యం దుకాణాలు,
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, సైదాబాద్: సైదాబాద్ ఠాణా పరిధిలోని ఆరేళ్ల బాలికను పైశాచికంగా హత్యాచారం చేసి పారిపోయిన రాజును పట్టుకునేందుకు రాజధాని నగరాన్ని వేలమందితో కూడిన ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. మద్యం దుకాణాలు, బార్లు, కల్లుకాంపౌండ్లకు పోలీసులు వెళ్లి ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు ప్రకటించిన రెండు ఫోన్ నంబర్లకు వందలకొద్దీ కాల్స్ వస్తున్నాయి. నిందితుడిని పోలి ఉన్న వ్యక్తుల ఫొటోలు పంపుతున్నారని ఉత్తర మండలం సంయుక్త కమిషనర్ ఎం.రమేష్రెడ్డి తెలిపారు. రాజు వివరాలున్న ఫొటోలను హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని బస్సులు, ఆటోలకు అతికించారు. హైదరాబాద్ పోలీసులు గణేశ్ మండపాల వద్ద మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. గుండు చేయించుకుంటే ఎలా ఉంటాడనే చిత్రాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.
రాజు.. ఓ ఉన్మాది...
హంతకుడు పలకొండ రాజు మద్యానికి బానిసై పైశాచికంగా ప్రవర్తించేవాడని తెలుసుకున్నారు. ఉన్మాదిలా ప్రవర్తించేవాడని గుర్తించారు. మేనకోడలు పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. చస్తానంటూ బెదిరించి ఓ యువతి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుని తర్వాత ఆమెను విపరీతంగా కొట్టేవాడని బంధువులు పోలీసులకు చెప్పారు. ఒకరోజు మద్యం తాగి పీక మీద కాలుపెట్టి చంపబోతే ఆమె భయంతో పాపను తీసుకుని పారిపోయిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.