Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
ఓ సినిమాలో దోపిడీ (Robbery) సీన్తో ప్రేరణ పొందిన ముగ్గురు వ్యక్తులు.. అదే స్టైల్లో దోపిడీకి పాల్పడ్డారు. ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందుతులను అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పుణె: ఓ సినిమాలోని దొంగతనం సీన్తో ప్రేరణ పొంది అచ్చం అలాంటి చోరీకే (Robbery) పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. అలా రూ.47 లక్షలు కాజేసిన ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో (Pune) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానాపేట్కు చెందిన మంగళ్పురి గోస్వామి అనే వ్యక్తి మార్కెటింగ్ ఏజెన్సీలో 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఏజెన్సీకి సంబంధించిన డబ్బును బ్యాంకులో వేయడం అతని విధి. కొంతకాలంగా ఇది గమనిస్తున్న కొందరు వ్యక్తులు అతడి నుంచి డబ్బు కాజేసేందుకు ప్రణాళిక రచించారు. దీంతో రోజూలాగే బ్యాంకుకు వెళుతున్న గోస్వామిని ఇటీవల ఉదయం ఆజాద్ చౌక్ వద్ద ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. పదునైన కత్తి చూపించి బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.47 లక్షల డబ్బును దోచుకుని పరారయ్యారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా మార్చి 23న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అనంతరం నిందితులను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లోని 500 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. వీడియోలో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు గైక్వాడ్ పట్టుకున్నారు. నానాపేట్కు చెందిన రుషికేశ్ గైక్వాడ్, కిరణ్ అశోక్ పవార్, ఆకాష్ కపిల్ గోరాడ్లు ఈ దోపిడీకి పాల్పడ్డట్లు నిర్ధారించారు. గైక్వాడ్ గతంలో మార్కెటింగ్ ఏజెన్సీలో సేల్స్మెన్గా పనిచేసినట్లు విచారణలో వెల్లడైంది. పనిచేస్తున్న సమయంలో అతడిపై కొన్ని ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం.. గోస్వామి రోజూ నగదు తీసుకెళ్లడాన్ని గమనించిన నిందితుడు అతన్నుంచి డబ్బు కాజేయాలని పథకం పన్నాడు. ఓ సినిమా నుంచి ప్రేరణ పొందిన అతడు.. తన స్నేహితులతో కలిసి అచ్చం అలానే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులకు వివరించాడు. నిందితుల నుంచి రూ.25 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పుణె డీసీపీ సందీప్ సింగ్ గిల్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది కిలోల బంగారం స్వాధీనం
ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. -
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా