డ్రగ్స్‌ కేసు: ఆ నటి ఇంట్లో పోలీసులు సోదాలు!

కర్ణాటక చిత్ర రంగాన్ని డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తోంది. మాదకద్రవ్యాలు, గంజాయి వ్యాపారాలపై కర్ణాటక సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ అధికారులు చేపడుతున్న తనిఖీలు, విచారణల్లో...........

Published : 04 Sep 2020 15:20 IST

డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన రాగిణి ద్వివేది

బెంగళూరు: కర్ణాటక చిత్ర రంగాన్ని డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తోంది. మాదకద్రవ్యాలు, గంజాయి వ్యాపారాలపై కర్ణాటక సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ అధికారులు చేపడుతున్న తనిఖీలు, విచారణల్లో కొందరు కన్నడ నటుల పేర్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.  ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇటీవల కొందరు సినీ నటులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సినీనటి రాగిణి ద్వివేది ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.  ఉదయం 6గంటల సమయంలో బెంగళూరులోని ఆమె నివాసానికి వెళ్లిన సీసీబీ అధికారుల బృందం దాదాపు నాలుగు గంటల పాటు  సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులను సీజ్‌ చేశారు. ఆ సమయంలో వారితో ఆమె వాదనకు దిగినట్టు సమాచారం.

అంతకముందు, సినీనటి నివాసంలో సోదాలు జరిపేందుకు సీసీబీ బృందం కోర్టు నుంచి సెర్చ్‌ వారెంట్ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ కేసులో ఆమె పేరు వెలుగులోకి రావడంతో బుధవారమే రాగిణికి నోటీసులు జారీ చేశారు. గురువారం తమ ఎదుట విచారణకు హాజరవ్వాలని సూచించారు. అయితే, విచారణకు హాజరుకాకుండా సోమవారం వరకు తనకు గడువు ఇవ్వాలని పోలీసులను కోరుతూ ఆమె తన న్యాయవాదులను పంపారు. అయితే, శుక్రవారం హాజరు కావాల్సిందేనని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో సోదాల అనంతరం ఆమె సీసీబీ విచారణకు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. 

ఇదీ చదవండి..
కన్నడ చిత్రసీమలో డ్రగ్స్‌ తుపాను!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని