భార్యను నిద్రలేపి ‘కొడుకును చంపా’నన్నాడు!
లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయిన ఓ తండ్రి కన్న కొడుకు పాలిట యమపాశమయ్యాడు. మానసికంగా కుంగుబాటుకు గురైన ఆయన తన ఏడేళ్ల కుమారుడ్ని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పక్కన
మృతదేహంతో నిద్ర..
కాన్పూర్: లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయిన ఓ తండ్రి కన్న కొడుకు పాలిట యమపాశమయ్యాడు. మానసికంగా కుంగుబాటుకు గురైన ఆయన తన ఏడేళ్ల కుమారుడ్ని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 43 ఏళ్ల శ్రీవాస్తవ తన సతీమణి సారిక, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి కాన్పూర్లోని సీసము ప్రాంతంలో ఉంటున్నాడు. లాక్డౌన్లో శ్రీవాస్తవ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో అప్పటి నుంచి తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. కాగా సారిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన శ్రీవాస్తవ కుమారుడు రుశాంక్ను చంపేశాడు. అనంతరం శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భార్యను నిద్రలేపి జరిగిన విషయం చెప్పాడు. ఇప్పుడు మన కుమారుడ్ని ఎవరూ ఇబ్బందిపెట్టలేరు, అతడికి ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రశాంతంగా ఉంటాడు.. అన్నాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె వెంటనే బంధువులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. పోలీసులకు కూడా సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి రుశాంక్ను భర్త చంపేశాడని సారిక పోలీసులకు వివరించింది. ఇంట్లోని ఓ గదిలో బాబు మృతదేహంతో కలిసి నిద్రపోయినట్లు చెప్పిందని పోలీసులు తెలిపారు.
ఉద్యోగం కోల్పోవడం వల్ల శ్రీవాస్తవ మానసికంగా కుంగిపోయాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయనకు కుమారుడంటే ఎంతో ప్రేమని, అపురూపంగా చూసుకునేవాడన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి బాధపడుతూ ఉండేవాడని తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీవాస్తవ నేరాన్ని ఒప్పుకున్నాడు. బాబు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్