లక్నవరం చెరువులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గల్లంతు

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయంలో ప్రమాదవశాత్తు జారిపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుధాకర్‌ (22) గల్లంతయ్యారు. గల్లంతైన

Published : 26 Dec 2020 02:26 IST

గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయంలో ప్రమాదవశాత్తు జారిపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుధాకర్‌ (22) గల్లంతయ్యారు. గల్లంతైన సుధాకర్‌ను పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో స్నేహితులతో కలిసి శుక్రవారం ఉదయం లక్నవరం చేరుకున్నారు. సాయంత్రం చెరువుకట్టపై మెట్ల ప్రాంతంలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి జలాశయంలో పడి గల్లంతయ్యారు. అప్పటికే చీకటి పడటంతో పక్కనే ఉన్న స్నేహితులు ఏమీ చేయలేకపోయారు. స్థానిక ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

ఇవీ చదవండి..

ఆ యాప్‌లకు చైనా, సింగపూర్‌ నుంచి నిధులు?

నితీశ్‌‌కి షాకిచ్చిన భాజపా

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని