కాబూల్‌లో ఉగ్రదాడి.. 16 మంది సైనికుల మృతి

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్‌లోని తూర్పు ప్రావిన్స్‌..

Published : 11 Sep 2020 14:49 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్‌లోని తూర్పు ప్రావిన్స్‌ నన్గర్‌హార్‌ ప్రాంతంలోని పలు సైనిక స్థావరాలపై దాడి చేసి 16 మంది సైనికులను హతమార్చారు. ఈ దాడిలో పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గండుమాక్‌ ప్రాంతంలోని పోలీసులు, సైనికులకు చెందిన మూడు శిబిరాలపై ఏకకాలంలో తుపాకులు, బాంబులతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి.  తాలిబాన్ ఖైదీలను విడుదల చేసే యోచనతో శనివారం ఖతార్‌లో ప్రారంభం కానున్న శాంతి చర్చలకు ముందే ఈ దాడి జరగడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని