Ap News: సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఎమ్మెల్యే సోదరుని భార్య, కూతురు మృతి

గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే బంధువులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాచర్ల...

Updated : 12 Jan 2022 06:39 IST

దుర్గి: గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే బంధువులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిన్నాన్న కుమారుడు మదన్‌మోహన్‌ రెడ్డి కుటుంబం కారులో వెళ్తుండగా.. దుర్గి మండలం అడిగొప్పుల వద్దకు రాగానే అదుపుతప్పి సాగర్‌ కాలువలోకి దూసుకెళ్లింది.  ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మదన్‌మోహన్‌ రెడ్డిని సురక్షితంగా కాపాడారు. కారులో ఉన్న ఆయన భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సాగర్‌ కాలువలో పడిన కారును అధికారులు గజ ఈతగాళ్లతో గాలించారు. అనంతరం అర్ధరాత్రి 2 గంటల సమయంలో కారును వెలికితీయగా వారి మృతదేహాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని