Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
ఆన్లైన్లో తరచుగా షాపింగ్ చేసే యూజర్ వివరాలను సేకరించి వారి నుంచి క్యాన్సిలేషన్ ఓటీపీ (OTP) పేరుతో వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న కొత్త పంథా సైబర్ మోసం (Cyber Fraud) తాజాగా వెలుగులోకి వచ్చింది.
దిల్లీ: సైబర్ నేరాల (Cyber Crime) కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, నేరగాళ్లు కొత్త పంథాలో వినియోగదారులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ-కామర్స్ (e-commerce) సంస్థల పేరుతో ఓటీపీ (OTP) ద్వారా కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. వీటి గురించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCCRP) వెల్లడించింది.
ఈ తరహా మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) ముందుగా సేకరించిన మొబైల్ నంబర్ల ఆధారంగా ఈ-కామర్స్ సంస్థల నుంచి తరచుగా వస్తువులు డెలివరీ అవుతున్నవినియోగదారుడి వివరాలు సేకరిస్తారు. సదరు యూజర్కు ఫోన్ చేయడం లేదా వాళ్ల ఇంటికి వెళ్లి, ఈ-కామర్స్ ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటారు. తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ వచ్చినట్లు చెబుతారు. కస్టమర్ తాను ఆర్డర్ చేయలేదని, నగదు చెల్లించేందుకు నిరాకరిస్తే, ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి చెబుతారు. అందుకోసం కస్టమర్ ఫోన్కు ఓటీపీ పంపినట్లు నమ్మిస్తారు. సదరు ఓటీపీని చెప్పిన వెంటనే కస్టమర్ ఫోన్ను హ్యాక్ చేసి, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు. పలుసందర్బాల్లో సైబర్ నేరగాళ్లు మోసం చేయాలనుకున్న వ్యక్తి ఇంట్లో లేకపోతే, పక్కింటి వారిని దగ్గరకు వెళ్లి సదరు వ్యక్తి నుంచి ఓటీపీ అడగమని కోరినట్లు పలువురు వినియోగదారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విధమైన ఫిర్యాదులు ఎన్సీసీఆర్పీలో ఇటీవలి కాలంలో ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఓటీపీని ఎవరితో షేర్ చేయొద్దని సూచించింది. అలానే ఫోన్ చేసిన వ్యక్తి నిజంగా సదరు ఈ-కామర్స్ సంస్థ ప్రతినిధి అవునా? కాదా? అనేది నిర్ధారించుకోవాలని కోరింది. ఆర్డర్ చేయని ప్యాకెజ్ను రిసీవ్ చేసుకోవద్దని సూచించింది. వ్యక్తిగత సమాచారం కోరుతూ ఈ-కామర్స్ ప్రతినిధులమని చెబుతూ పంపే వెబ్ లింక్లను క్లిక్ చేయొద్దని కోరింది. డెలివరీ ప్రతినిధులమని చెప్పే వారి వద్ద క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయొద్దని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
బెంగళూరులో పేలుడు పదార్థాలు వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
శంషాబాద్ పరిధిలో నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. -
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. -
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
వంట చేయడంలో ఆలస్యం అయిందని ఓ వ్యక్తి భార్యను పదునైన ఆయుధంతో చంపేశాడు. అనంతరం భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు