Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
ఆన్లైన్లో తరచుగా షాపింగ్ చేసే యూజర్ వివరాలను సేకరించి వారి నుంచి క్యాన్సిలేషన్ ఓటీపీ (OTP) పేరుతో వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న కొత్త పంథా సైబర్ మోసం (Cyber Fraud) తాజాగా వెలుగులోకి వచ్చింది.
దిల్లీ: సైబర్ నేరాల (Cyber Crime) కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, నేరగాళ్లు కొత్త పంథాలో వినియోగదారులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ-కామర్స్ (e-commerce) సంస్థల పేరుతో ఓటీపీ (OTP) ద్వారా కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. వీటి గురించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCCRP) వెల్లడించింది.
ఈ తరహా మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) ముందుగా సేకరించిన మొబైల్ నంబర్ల ఆధారంగా ఈ-కామర్స్ సంస్థల నుంచి తరచుగా వస్తువులు డెలివరీ అవుతున్నవినియోగదారుడి వివరాలు సేకరిస్తారు. సదరు యూజర్కు ఫోన్ చేయడం లేదా వాళ్ల ఇంటికి వెళ్లి, ఈ-కామర్స్ ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటారు. తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ వచ్చినట్లు చెబుతారు. కస్టమర్ తాను ఆర్డర్ చేయలేదని, నగదు చెల్లించేందుకు నిరాకరిస్తే, ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి చెబుతారు. అందుకోసం కస్టమర్ ఫోన్కు ఓటీపీ పంపినట్లు నమ్మిస్తారు. సదరు ఓటీపీని చెప్పిన వెంటనే కస్టమర్ ఫోన్ను హ్యాక్ చేసి, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు. పలుసందర్బాల్లో సైబర్ నేరగాళ్లు మోసం చేయాలనుకున్న వ్యక్తి ఇంట్లో లేకపోతే, పక్కింటి వారిని దగ్గరకు వెళ్లి సదరు వ్యక్తి నుంచి ఓటీపీ అడగమని కోరినట్లు పలువురు వినియోగదారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విధమైన ఫిర్యాదులు ఎన్సీసీఆర్పీలో ఇటీవలి కాలంలో ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఓటీపీని ఎవరితో షేర్ చేయొద్దని సూచించింది. అలానే ఫోన్ చేసిన వ్యక్తి నిజంగా సదరు ఈ-కామర్స్ సంస్థ ప్రతినిధి అవునా? కాదా? అనేది నిర్ధారించుకోవాలని కోరింది. ఆర్డర్ చేయని ప్యాకెజ్ను రిసీవ్ చేసుకోవద్దని సూచించింది. వ్యక్తిగత సమాచారం కోరుతూ ఈ-కామర్స్ ప్రతినిధులమని చెబుతూ పంపే వెబ్ లింక్లను క్లిక్ చేయొద్దని కోరింది. డెలివరీ ప్రతినిధులమని చెప్పే వారి వద్ద క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయొద్దని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM