Karnataka: పేలిన ఏసీ... ఒకే కుటుంబంలోని నలుగురి మృతి

ఎండాకాలం అని చల్లగా ఏసీ వేసుకొని సేదతీరుతున్నారా. అయితే కొంచెం జాగ్రత్త వహించండి.

Published : 09 Apr 2022 01:56 IST

బెంగళూరు: ఎండాకాలమని చల్లగా ఏసీ వేసుకొని సేదతీరుతున్నారా? అయితే కొంచెం జాగ్రత్త వహించండి. ఏసీ పేలి ఒకే కుటుంబానికి మృతి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లా మిరియమ్మహల్లీ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఏసీ నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు చెలరేగాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న వెంకట్ ప్రశాంత్ (42), అతడి భార్య డి.చంద్రకళ (38), కుమారుడు అద్విక్ (6), కుమార్తె ప్రేరణ (8) మంటల్లో చిక్కుకొని మరణించారు. ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా అనే అంశంపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. కుటుంబానికి ఏమైనా అప్పులు ఉన్నాయా, ఒత్తిడికి గురయ్యారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని