ఉమ్మనీరు తాగి.. ఊపిరి ఆడక
తమ కలలు ఫలిస్తున్నాయని ఆ దంపతులు ఎంతో ఆశ పడ్డారు. భార్యకు ప్రసవం నొప్పులు రాగానే ఆసుపత్రికి వచ్చారు. బిడ్డతో సంతోషంగా తిరిగి వెళ్లాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మగ బిడ్డ పుట్టినా పురిటిలోనే మృతి చెందడంతో వారి ఆవేదనకు అంతే లేకుండా
పసికందు మృతి
అందుబాటులో లేని వైద్యుడు, స్టౌఫ్నర్స్
ప్రసవం చేసేందుకు ప్రయత్నించి విఫలమైన ఏఎన్ఎం
ఆక్సిజన్ సౌకర్యం కరవు
ఆసుపత్రి సిబ్బందితో బాధితుల వాగ్వాద
మృతి చెందిన పసికందు
తమ కలలు ఫలిస్తున్నాయని ఆ దంపతులు ఎంతో ఆశ పడ్డారు. భార్యకు ప్రసవం నొప్పులు రాగానే ఆసుపత్రికి వచ్చారు. బిడ్డతో సంతోషంగా తిరిగి వెళ్లాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మగ బిడ్డ పుట్టినా పురిటిలోనే మృతి చెందడంతో వారి ఆవేదనకు అంతే లేకుండా పోయింది. సమయానికి వైద్యుడు, స్టాఫ్నర్స్ లేకపోవడం... ఏఎన్ఎం ప్రసవం చేయడం, ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు చుట్టుముట్టడంతో ఓ పసికందు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఈ లోకాన్ని చూడకుండానే ఆ బిడ్డ కన్నుమూశాడు.
సంతబొమ్మాళి, న్యూస్టుడే : సంతబొమ్మాళి గ్రామం బీసీ కాలనీకి చెందిన గర్భిణి దూబ కుమారికి శనివారం అర్ధరాత్రి 1.30గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో సంతబొమ్మాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి ఏఎన్ఏం సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. వైద్యుడికి చరవాణిలో సమాచారం అందించామన్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చినా ఆ పసికందు ఉమ్మనీరు తాగడంతో శ్వాస సక్రమంగా అందలేదు. ఆసుపత్రిలో ఆక్సిజన్, ఇతర పరికరాల సౌకర్యం లేకపోవడంతో చిన్నారి చనిపోయాడు. బిడ్డ దక్కకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వైద్యుడు అందుబాటులో లేనప్పుడు వేరే ఆసుపత్రికి పంపించకుండా ఎందుకు ప్రసవం చేశారని ఏఎన్ఎంను నిలదీశారు. బాలింతను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఆదివారం ఆసుపత్రికి వైద్యులు ఎవరూ రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సంతబొమ్మాళి ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ విషయంపై సంబంధిత వైద్యాధికారి గురుమూర్తిని ‘న్యూస్టుడే’ సంప్రందించగా మొబైల్ ఫోన్ స్వీచ్ ఆఫ్ వచ్చింది.
విషాదంలో కుటుంబ సభ్యులు
కలెక్టర్ హెచ్చరించినా..మారని తీరు
మండల కేంద్రంలో జనవరి 2వ తేదీన జిల్లా కలెక్టర్ జి.నివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా సంతబొమ్మాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్ర నిర్వహణ తీరు అధ్వానంగా ఉండటంతోపాటు పీహెచ్సీలో ప్రసవాలు సక్రమంగా జరగకపోవడంతో వైద్యాధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సిబ్బంది తీరు మారలేదు. పీహెచ్సీలో ప్రసవానికి వచ్చిన సమయంలో వైద్య సేవలు సక్రమంగా అందించకపోవడంతో పసికందు మృతి చెందిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాత, శిశు మరణాలను అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఫలితం మాత్రం అంతంతమ్రాతం గానే ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆరోగ్య కేంద్రాలు అరకొర సిబ్బందితోను, సౌకర్యాల లేమి, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సతమతవుతున్నాయని, దీని వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు.
ఎంతో ప్రయత్నించా..
బాలింత మృతి చెందిన మగబిడ్డకు ప్రసవించింది. బాబును బతికించాలన్న తాపత్రయంతో ఎంతో కృషి చేశా. బాబు చనిపోవడానికి ఉమ్మనీరు తాగడమే కారణం. - సంతబొమ్మాళి ఏఎన్ఎం.
ఆరా తీశా ..
ఆదివారం ఉదయం 11గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశా. వైద్యుడు సెలవుల్లో ఉన్న విషయం నాకు తెలియదు. వైద్యుడితో మాట్లాడి విషయం తెలియజేస్తాను. - రామారావు, ఈవో, సంతబొమ్మాళి పీహెచ్సీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్