ఆటోలను ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురి మృతి 

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు రెండు ఆటోలను ఢీకొట్టిన ఘటనలో......

Published : 15 Jun 2020 13:36 IST

గయా: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు రెండు ఆటోలను ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాతపడగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గయా జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. బిష్ణుగంజ్‌ గ్రామం సమీపంలోని జీటీ రహదారిపై ఈ ప్రమాదం జరిగనట్లు జిల్లా ఎస్పీ రాజీవ్‌ మిశ్రా తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించినట్టు చెప్పారు. అలాగే, ఈ ప్రమాదంలో గాయాలైన వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి ఆరోగ్య విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితలు రెగానియా ప్రాంతంలో జరిగిన ఓ వేడుకలో పాల్గొని రెండు ఆటోల్లో (గయా నుంచి ఔరంగాబాద్‌ వైపు) ప్రయాణిస్తుండగా ఈ ఘటన  చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు