పోలీసుల హత్య వెనుక అతడు
రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్ పోలీసులు మృత్యువాతపడ్డారు. గురువారం అర్ధరాత్రి దుండగుల కాల్పుల్లో..
దాదాపు 60 కేసుల్లో వికాస్ దూబే నిందితుడు
లక్నో: రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన ఎనిమిది మంది ఉత్తర్ప్రదేశ్ పోలీసులు మృత్యువాతపడ్డారు. గురువారం అర్ధరాత్రి దుండగుల కాల్పుల్లో మృతిచెందిన వారిలో ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్లోనే కరడుగట్టిన నేరస్థుల్లో వికాస్ దూబే ఒకడు. అతడిపై హత్య కేసులు సహా దాదాపు 60 కేసులు ఉన్నాయి. పలుమార్లు పోలీసులు అరెస్టు చేసినా ఎలాగోలా తప్పించుకున్నాడు. కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నివసిస్తున్న అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని ముందే పసిగట్టాడు. రాష్ట్ర రాజధాని నుంచి 150 కి.మీ. దూరంలో ఉండే గ్రామం వరకు అనేక చోట్ల రహదారిని బ్లాక్ చేయించాడు. రోడ్డుకు అడ్డంగా ఉంచిన ఓ బుల్డోజర్ సహా పోలీసులు పలు అడ్డంకులను తొలగించుకొని ముందుకుసాగారు. నేరస్థుడు ఉంటున్న గ్రామానికి చేరుకోగానే ఓ ఇంటి దాబాపై మాటువేసిన దుండగులు పోలీసులపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. వారి వాహనాలపై బులెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
1990లో ఓ హత్య కేసుతో వికాస్ దూబే నేర ప్రస్థానం మొదలైంది. కాన్పూర్ భాజపా నాయకుడు సంతోష్ శుక్లాను పోలీసుస్టేషన్లోనే వెంటాడి హత్య చేశాడు. 2002లో అతడు పోలీసులకు లొంగిపోయాడు. తిరిగి తప్పించుకున్నాడు. ఓ హత్యాయత్నం కేసులో దూబేను అరెస్టు చేసేందుకు మూడు పోలీసు బృందాలు సదరు గ్రామానికి చేరుకోగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నేరస్థుడైన దూబేకు రాజకీయ అండదండలు ఉన్నాయి. జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు జిల్లా పంచాయతీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొంది. -
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య