చలానా గాళ్ఫ్రెండ్ది.. కార్డేమో భార్యది
కుర్రాడికి పెళ్లైంది.. అందాల రాశిలాంటి భార్య ఉంది. అయినా అదేం రోగమో ‘మైనే తుమ్ కో ప్యార్ కియా’ అంటూ ఇంకో అమ్మాయిని
భార్య కార్డుతో గాళ్ఫ్రెండ్ చలానా కట్టేశాడు
ఇంటర్నెట్ డెస్క్: కుర్రాడికి పెళ్లైంది.. అందాల రాశిలాంటి భార్య ఉంది. అయినా అదేం రోగమో ‘మైనే తుమ్ కో ప్యార్ కియా’ అంటూ ఇంకో అమ్మాయిని వలచాడు. బహుమతులిచ్చాడు. చాటుమాటుగా సరసాలాడాడు. అంతదాకా బాగానే ఉందిగానీ ఆమెపై వ్యామోహం ఎక్కువై భార్య క్రెడిట్ కార్డుతో గాళ్ఫ్రెండ్ వాహనం చలాన్లు కట్టి అడ్డంగా దొరికిపోయాడు. దుబాయ్లో జరిగిందీ చిత్రమైన సంఘటన.
రెండ్రోజుల కిందట ఆ భార్య సెల్ఫోన్కి ఎస్ఎంఎస్ వచ్చింది. ‘మీ క్రెడిట్ కార్డుతో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు కట్టినందుకు థ్యాంక్స్’ అని. వెంటనే హ్యాండ్బ్యాగ్ వెతికిచూసిందామె. కార్డు కనిపించలేదు. ఎవరో దొంగిలించారని ఆమె గుండె జల్లుమంది. వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించింది. ఆ వెనకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగారు వాళ్లు. వాహనం ఎవరి పేరు మీద ఉందో తనని పట్టుకోవడం పెద్దగా కష్టమేం కాలేదు పోలీసులకు. ‘నీకు ఆ కార్డు ఎక్కడిది? ఫైన్ ఎలా కట్టావ్?’ అని నిలదీశారు. ‘ఇందులో తప్పేముంది? నా బోయ్ఫ్రెండ్ కట్టేశాడు. అయినా మీరెందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు?’ అని ఎదురు దబాయించింది ఆ అమ్మడు. ఇలా కాదనుకొని ఇద్దరినీ స్టేషన్కి తీసుకెళ్లి విచారణ మొదలుపెట్టారు. అప్పుడే సీన్ అందరికీ క్లియర్గా అర్థమైంది. తన బోయ్ఫ్రెండ్కి అప్పటిదాకా పెళ్లి కాలేదని ఆ గాళ్ఫ్రెండ్ అనుకుంది పాపం! ‘మీ భర్తే మీ కార్డును గాళ్ఫ్రెండ్ కోసం వాడాడు’ అని పోలీసులు చెప్పగానే అవాక్కైంది అర్థాంగి.
ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలిలా ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటెయిన్ చేస్తున్న గురుడి బండారం మొత్తం బయటపడింది. క్రెడిట్ కార్డు హ్యాక్ అయిందని ఇల్లాలు భయపడితే ఇల్లే గుల్ల అయ్యిందని తెలుసుకుంది. ‘క్రెడిట్ కార్డు మోసం జరిగిందంటూ గతంలో ఎన్నో ఫిర్యాదులు అందుకున్నాం.. కానీ ఇలా భర్తే భార్యకు తెలియకుండా మోసం చేసిన సంఘటన మొదటిసారి చూశాం’ అంటున్నారు ఈ కేసును ఛేదించిన దుబాయ్ సైబర్ క్రైం డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కెప్టెన్ అబ్దుల్లా ఆల్ షాహీ.
ఇదీ చదవండి..
AP: అభ్యర్థుల ధ్రువపత్రాలపై ఎస్ఈసీ స్పష్టత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొంది. -
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య