30 వేల కట్నం కోసం.. ముగ్గురి ప్రాణాలు బలి
ఓ కుటుంబంలో కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు, మరో ఇంట్లో మనస్పర్థలు.. ఈ కారణాలతో ఇద్దరు తల్లులు, ముగ్గురు బోసినవ్వుల చిన్నారుల ప్రాణాలు గంగలో కలిసిపోయాయి. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో మహిళ తన రెండేళ్ల కుమార్తెతో సహా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో దూకి ప్రాణాలు విడిచింది. శ్రీరామనవమి పండుగ రోజు ఈ ఘటనలు ఆయా గ్రామాల్లో తీరని విషాదం నింపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అత్తింటి వారి వేధింపులు తాళలేక ఇద్దరు చిన్నారులతో బావిలో దూకిన తల్లి
మరో ఘటనలో మనస్తాపంతో కుమార్తె సహా తల్లి ఆత్మహత్య
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి: ఓ కుటుంబంలో కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు, మరో ఇంట్లో మనస్పర్థలు.. ఈ కారణాలతో ఇద్దరు తల్లులు, ముగ్గురు బోసినవ్వుల చిన్నారుల ప్రాణాలు గంగలో కలిసిపోయాయి. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో మహిళ తన రెండేళ్ల కుమార్తెతో సహా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో దూకి ప్రాణాలు విడిచింది. శ్రీరామనవమి పండుగ రోజు ఈ ఘటనలు ఆయా గ్రామాల్లో తీరని విషాదం నింపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్కు చెందిన టెక్కం రాజయ్య కుమార్తె విజయ(25)ను నిమ్మనపల్లికి చెందిన స్వామికి ఇచ్చి 2016లో పెళ్లి చేశారు. కట్నం కింద రూ.1.50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా వివాహ సమయంలో రూ.70 వేల నగదు, రూ.50 వేల విలువైన బంగారం ఇచ్చారు. వారికి కుమారుడు శివకృష్ణ(3), కూతురు శ్రీకృతి(2) జన్మించారు. స్వామి పెద్దపల్లిలో రోజువారీ కూలి పనులు చేస్తుంటాడు. కట్నం బాకీ రూ.30 వేలతో పాటు అదనంగా రూ.లక్ష కట్నం తేవాలంటూ ప్రతి రోజూ విజయను ఆడబిడ్డ పద్మదేవేంద్ర, భర్త స్వామి, అత్త లక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు శారీరకంగా, మానసికంగా వేధించేవారు. ఈ విషయమై గతంలో అబ్బాపూర్లో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరగగా.. రూ.30 వేల కట్నం బాకీ ఇస్తామని విజయ తల్లిదండ్రులు చెప్పారు. ఆ తర్వాత విజయ తల్లి చనిపోవడం, పంటలు పండకపోవడంతో కట్నం బాకీ ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆడబిడ్డ పద్మదేవేంద్ర, అత్త లక్ష్మిలు కట్నం తేవాలంటూ విజయను తీవ్రంగా కొట్టారు. ఈ విషయాన్ని విజయ పెద్దపల్లిలో ఉన్న భర్తకు ఫోన్ చేసి చెప్పగా.. సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడతానని ఆయన అక్కడే ఉండిపోయాడు. తర్వాత విజయ పిల్లలను తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం నిమ్మనపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. బావి అడుగున ఉన్న విజయ మృతదేహాన్ని ఈతగాళ్ల సాయంతో వెలికితీశారు. మృతురాలి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విజయ భర్త, అత్త, ఆడబిడ్డ, బావ, తోటికోడలిని అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది కిలోల బంగారం స్వాధీనం
ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. -
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా