Crime News: విమానాల్లో వస్తారు.. ఏటీఎంలు దోచేస్తారు
ఆరుగురు సభ్యుల ముఠా.. అందరిది హరియాణా.. విమానాల్లో దేశమంతా తిరుగుతారు.. కేవలం ఒకే కంపెనీ ఏటీఎంలు దోచుకెళ్తారు. డిజిటల్ కీల సాయంతో కొన్నేళ్లుగా ఏటీఎంల్లో దోపిడీకి పాల్పడుతున్న ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
హరియాణా ముఠా అరెస్టు
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్టుడే: ఆరుగురు సభ్యుల ముఠా.. అందరిది హరియాణా.. విమానాల్లో దేశమంతా తిరుగుతారు.. కేవలం ఒకే కంపెనీ ఏటీఎంలు దోచుకెళ్తారు. డిజిటల్ కీల సాయంతో కొన్నేళ్లుగా ఏటీఎంల్లో దోపిడీకి పాల్పడుతున్న ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్ ఎస్బీఐ ఏటీఎంలో ఈ నెల 16న రాత్రి 7.30కు ఓ అనుమానిత లావాదేవీ జరిగింది. అప్పటికే సీసీ కెమెరాల ద్వారా విషయాన్ని గుర్తించిన బ్యాంకు సిబ్బంది మేనేజర్కు తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలో దిగి కేంద్రాన్ని పరిశీలించారు. అరగంట వ్యవధిలో డిజిటల్ కీ సాయంతో రూ.30 వేలు నగదు డ్రా చేసి తప్పించుకొన్నట్లు గుర్తించారు. సీసీ టీవీ దృశ్యాల సాయంతో రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు బస చేసినట్లు తెలియడంతో తనిఖీలు చేశారు. ఎట్టకేలకు నిందితులు మహమ్మాద్ అల్తాబ్, వకీల్ అహ్మద్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వారి నుంచి రూ.30 వేల నగదు, రెండు చరవాణులు, రెండు ఏటీఎం మానిటర్ డిజిటల్ కీలు, వివిధ బ్యాంకులకు చెందిన 11 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకొన్నట్లు ఏసీపీ తెలిపారు.
నగదు విత్డ్రా సమయంలో..
హరియాణాలోని పాల్వాల్ జిల్లాకు చెందిన షాకీర్ ఆధ్వర్యంలో అల్తాబ్, వకీల్ అహ్మద్, అమీర్ సోహెల్, ఆషిక్, ఇన్సాఫ్ ఓ ముఠాగా ఏర్పడి హ్యోసంగ్ కంపెనీ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేస్తున్నారు. తొలుత ఒక రాష్ట్రాన్ని ఎంచుకున్నాక విమానంలో అక్కడికి వెళ్తారు. చోరీకి అనుకూలంగా ఉన్న ఏటీఎం కేంద్రాన్ని గుర్తించి సమీపంలోని లాడ్జిల్లో దిగుతారు. రాత్రివేళల్లో సీసీ కెమెరాలకు చిక్కకుండా బయటికొస్తారు. వారి దగ్గర ఉన్న డెబిట్ కార్డులతో నగదు విత్డ్రా చేస్తారు. సరిగ్గా యంత్రంలో నుంచి నగదు వచ్చే సమయంలో డిజిటల్ కీల సాయంతో సెన్సార్ పనిచేయకుండా చూసుకుంటారు. దీంతో డబ్బులు విత్డ్రా జరిగినా ఖాతాలో చూపించదు. ఇలా వివిధ కార్డులతో రూ.లక్షల్లో నగదు తీసుకొని ఆ రాష్ట్రం నుంచి ఉడాయిస్తారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎస్హెచ్వో ఆంజనేయులు, ఎస్సై నర్సింలు, సిబ్బంది నర్సింగ్రావు, రహీం, శ్రీనివాస్ బృందాన్ని ఏసీపీ అభినందించారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డెబిట్కార్డులు, డిజిటల్ కీలు, చరవాణిలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?