Covid Vaccine:టీకా లక్కీ డ్రాలో కూలీకి ఐఫోన్‌-12

టీకా రెండు డోసులు తీసుకున్నవారికి నిర్వహించిన లక్కీ డ్రాలో..

Updated : 25 Dec 2021 09:46 IST

అహ్మదాబాద్‌: టీకా రెండు డోసులు తీసుకున్నవారికి నిర్వహించిన లక్కీ డ్రాలో.. ఓ కూలీని రూ.70వేల విలువ చేసే ఐఫోన్‌-12 వరించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సంస్థ నిర్వహించిన ఈ లక్కీ డ్రాలో కిషన్‌భాయ్‌ అనే కూలీకి ఐఫోన్‌ దక్కింది. తనకు లక్కీ డ్రా వచ్చిందని అధికారులు తొలుత ఫోన్‌లో చెప్పినప్పుడు నమ్మలేదని కిషన్‌భాయ్‌ చెప్పారు. ‘‘నన్ను మోసం చేసేందుకు అలా చెబుతున్నారని అనుకున్నాను. టీకా తీసుకున్నప్పుడు నా ఆధార్‌ కార్డు జరాక్స్‌ పత్రం ఇచ్చాను. అందులో ఉన్న నా ఇంటి చిరునామాను వెతుక్కుంటూ అధికారులు నా ఇంటికి వచ్చి చెప్పారు’’ అని కిషన్‌భాయ్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని