వేధింపులతో దంపతుల ఆత్మహత్యాయత్నం
కొడుకు చేసిన పొరబాటుకు తండ్రిని పరిహారం చెల్లించమని పెద్దలు వేధించడంతో మనస్తాపానికి గురై భార్యతో కలిసి పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యానాంలో గురువారం చర్చనీయాంశమైంది.
చికిత్స పొందుతూ భర్త మృతి
యానాం, న్యూస్టుడే: కొడుకు చేసిన పొరబాటుకు తండ్రిని పరిహారం చెల్లించమని పెద్దలు వేధించడంతో మనస్తాపానికి గురై భార్యతో కలిసి పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యానాంలో గురువారం చర్చనీయాంశమైంది. ఎస్సై బడుగు కనకారావు, మృతుడి తరఫు బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సావిత్రినగర్కు చెందిన కామాడి దుర్గాప్రసాద్ సరకు రవాణా వ్యాన్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. గ్రామంలోని జెట్టీ వద్ద వ్యాన్ నిలిపిన సమయంలో ప్రమాదవశాత్తు అది ఉప్పుటేరులో పడిపోయి, మరమ్మతులకు రూ.1.50 లక్షలు ఖర్చయింది. దీంట్లో రూ.50వేలు డ్రైవర్ దుర్గాప్రసాద్ చెల్లించాలని పెద్దలు నిర్ణయించారు. అతడు ఆ సొమ్ము ఇవ్వలేదు. గ్రామంలో కోడిమాంసం అమ్ముకుని జీవిస్తున్న అతడి తండ్రి కామాడి ముత్యాలరావును ఆ సొమ్ము ఇవ్వాలంటూ గ్రామపెద్దలు ఒత్తిడి చేశారు. వేధింపులు భరించలేక ముత్యాలరావు, ఆయన భార్య పార్వతి చీమలమందు, ఫినాయిల్ కలుపుకొని డిసెంబరు 5న మధ్యాహ్నం తాగేశారు. యానాం ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడకు వారిని తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ముత్యాలరావు(47) కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో గ్రామపెద్దలు నలుగురిపై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ కనకారావు చెప్పారు.
‘గ్రామ పెద్దలే కారణం’
నా భర్త, నేను ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణం గ్రామపెద్దలే.. నా భర్త, నేను చనిపోయినా నా కొడుకు, నా మనవడికి ఏ హాని జరిగినా కారణం సావిత్రినగర్ గ్రామపెద్దలే. అంటూ కామాడి పార్వతి ఇచ్చిన వీడియో వాంగ్మూలం గురువారం యానాంలో వైరల్ అయింది. కర్రి స్వామి, రేఖాడి నారాయణ, చింతా అప్పారావు, మల్లాడి బీరాస్వామి తదితరుల వల్లే తాము పురుగుల మందు తాగి చనిపోతున్నామంటూ ఆమె పలు అభియోగాలు మోపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్