అమృతా ఫడణవీస్‌ను బెదిరించి.. రూ.10కోట్లు డిమాండ్‌

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృతాకు రూ.కోటి ఇవ్వజూపిన డిజైనర్‌ అనిక్ష కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 19 Mar 2023 03:59 IST

ముంబయి: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృతాకు రూ.కోటి ఇవ్వజూపిన డిజైనర్‌ అనిక్ష కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేసేందుకు తొలుత లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన అనిక్ష.. అది కుదరకపోవడంతో అమృతాను బెదిరించినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. తనకు రూ.10కోట్లు ఇవ్వాలని లేదంటే అమృతకు చెందిన కొన్ని వీడియోలను వైరల్‌ చేస్తానని ఆ డిజైనర్‌ బెదిరించినట్లు తెలిపారు. దీంతో ఆమెపై తాజాగా బలవంతపు వసూళ్ల కేసు నమోదు చేశారు. అనిక్షపై ఇప్పటికే అమృతా బ్లాక్‌మెయిల్‌, బెదిరింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆమె తన తండ్రి అనిల్‌ జైసింఘానీకి సంబంధించిన క్రిమినల్‌ కేసులను మాఫీ చేయించేందుకు రూ.కోటి ఇవ్వజూపిందని అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు అమృత అంగీకరించకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనిక్ష, ఆమె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదైన రెండు రోజుల తర్వాత ఆ డిజైనర్‌.. అమృతకు రెండు వీడియోలను పంపింది. ఆ వీడియోల్లో డబ్బు ఉన్న బ్యాగును అమృతకు ఇస్తున్నట్లుగా ఉంది. తనకు రూ.10కోట్లు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోలను వైరల్‌ చేస్తానని ఆమె అమృతను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అవి మార్ఫింగ్‌ చేసినవిగా తేలినట్లు పేర్కన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని