ఎవరైనా కాపాడండి
‘భాయ్ క్యా హోరహాహే(సోదరా ఏం జరుగుతోంది) సేవ్ కరో.. యా అల్లా’ అంటూ కంటెయినర్ లారీ క్యాబిన్లో చిక్కుకున్న ఓ డ్రైవర్ ఆర్తనాదాలు చేస్తూ.. గంటన్నర పాటు నరక యాతన అనుభవించారు.
లారీ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ ఆర్తనాదాలు
గుంటూరు-విజయవాడ రహదారిపై రోడ్డు ప్రమాదం
ఘటనా స్థలంలో ఒకరు, ఆసుపత్రిలో మరొకరు మృతి
పెదకాకాని, న్యూస్టుడే: ‘భాయ్ క్యా హోరహాహే(సోదరా ఏం జరుగుతోంది) సేవ్ కరో.. యా అల్లా’ అంటూ కంటెయినర్ లారీ క్యాబిన్లో చిక్కుకున్న ఓ డ్రైవర్ ఆర్తనాదాలు చేస్తూ.. గంటన్నర పాటు నరక యాతన అనుభవించారు. గుంటూరు-విజయవాడ మార్గంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై గురువారం ఓ కంటెయినర్ లారీ అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లి అవతలి రోడ్డుపై వెళుతున్న మరో లారీని ఢీకొంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం ధ్వంసమవ్వగా, అందులోని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన్ను కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన మనీశ్వరరావుగా గుర్తించారు. కంటెయినర్ లారీ క్యాబిన్లో చిక్కుకున్న కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి డ్రైవర్ బషీర్ను స్థానికులు బయటకు తీసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. సుమారు గంటన్నర తరువాత హైవేకు చెందిన క్రేన్తో కంటెయినర్ లారీని పక్కకునెట్టి ముందు భాగాన్ని తాడు సాయంతో వెనక్కు లాగారు. కొన ఊపిరితో ఉన్న బషీర్ను హైవే పెట్రోలింగ్ పోలీసులు క్యాబిన్ నుంచి బయటకు తీసి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ మృతి చెందారు.
తాడేపల్లి నుంచి క్రేన్ రావాల్సిందే
పెదకాకాని మండల పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో సహాయం అందించేందుకు తాడేపల్లి నుంచి క్రేన్ను రప్పించే పరిస్థితి ఉంది. గతంలో క్రేన్ కాజ టోల్గేటు వద్ద ఉండేది. ప్రస్తుతం అది తాడేపల్లి వద్ద ఉందని స్థానికులు తెలిపారు. టోల్గేటుకి కిలోమీటరు దూరంలో రెండు లారీలు ఢీకొన్న ఘటనా స్థలం ఉంది. టోల్గేటు వద్ద క్రేన్ ఉన్నట్లయితే డ్రైవర్ ప్రాణం పోయేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్