తాళం వేసిన మృతుడి ఇంట్లో చోరీకి.. అంబులెన్స్ డ్రైవర్ మాస్టర్ప్లాన్
మహారాష్ట్రలోని నాగ్పుర్ నుంచి ఓ అంబులెన్స్ డ్రైవరు మధ్యప్రదేశ్లోని బైతుల్కు మృతదేహంతో బయలుదేరాడు. అదే సమయంలో.. నాగ్పుర్లో తాళం వేసి ఉన్న మృతుడి ఇంట్లోకి డ్రైవర్ కుమారుడు చొరబడి చోరీకి పాల్పడ్డాడు.
మహారాష్ట్రలోని నాగ్పుర్ నుంచి ఓ అంబులెన్స్ డ్రైవరు మధ్యప్రదేశ్లోని బైతుల్కు మృతదేహంతో బయలుదేరాడు. అదే సమయంలో.. నాగ్పుర్లో తాళం వేసి ఉన్న మృతుడి ఇంట్లోకి డ్రైవర్ కుమారుడు చొరబడి చోరీకి పాల్పడ్డాడు. ఓ పథకం ప్రకారం జరిగిన ఈ నేరాన్ని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. నాగ్పుర్లోని సక్కర్దరా ఠాణా పరిధిలో నివసిస్తున్న కల్పనా ఘోడే భర్త ఆగస్టు 20న ఓ ఆస్పత్రిలో మరణించారు. వీరి స్వస్థలం బైతుల్ కావడంతో అంత్యక్రియలు అక్కడే చేయాలని నిర్ణయించారు. దీంతో కల్పన భర్త మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకొని బయలుదేరారు.
ఇదే అదనుగా ఆ అంబులెన్సు డ్రైవరు అశ్వజిత్ వాంఖడే చోరీకి పథకం వేశాడు. తాము బయలుదేరాక.. తాళం వేసి ఉన్న కల్పన ఇంట్లో దొంగతనం చేయాలని తన కుమారుడు రితేశ్ వాంఖడేకు పురమాయించాడు. రితేశ్ ఇద్దరు మైనర్లతో ఆ ఇంట్లో చొరబడి రూ.లక్షల విలువైన ఆభరణాలు, నగదు అపహరించాడు. కల్పన తిరిగి ఇంటికొచ్చాక చోరీ విషయం బయటపడింది. వీధిలో ఉన్న సీసీ టీవీ ఫుటేజి పరిశీలించిన పోలీసులు ముగ్గురు యువకులు బైక్పై వచ్చి చోరీ చేసినట్లు గుర్తించి, రితేశ్ను అరెస్టు చేశారు. విచారణలో డ్రైవరు పథకం మొత్తం బయటపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.