Crime news: గర్ల్ఫ్రెండ్తో బ్రేకప్.. యువకుడి ఆత్మహత్య.. యువతిపై కేసు నమోదు
గర్ల్ఫ్రెండ్తో బ్రేకప్ కావడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్న ఘటన గురుగ్రామ్లో చోటుచేసుకుంది.
గురుగ్రామ్: ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అయిందని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడో యువకుడు. శివమ్ భాట్నాగర్ (25) అనే యువకుడు తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనకు ముందు యువకుడు మంగళవారం సాయంత్రం 6.45గంటల సమయంలో తన తండ్రినుద్దేశించి ఆకాశ్ అనే స్నేహితుడికి సూసైడ్ నోట్ను పంపాడు. అందులో ‘నాన్నా.. నన్ను క్షమించండి.. నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నా’ అని పేర్కొన్నట్లుగా పోలీసులు తెలిపారు.
థ్రిల్ కోసం డ్రగ్స్ వినియోగం.. ఓవర్ డోస్ కావడంతో యువతి మృతి
తన ఫ్రెండ్ పంపించిన లేఖను చూసిన యువకుడు తీవ్ర ఆందోళనకు గురై జరిగిన విషయాన్ని శివమ్ తండ్రి సంజయ్ భాట్నాగర్కు ఫోన్ చేసి చెప్పాడు. జాకాబ్పురలోని ఓ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న ఆయన.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివమ్ ఉండే గది తలుపులను బద్దలుకొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్కు కుమారుడు విగతజీవిగా వేలాడుతుండటం చూసిన ఆ తండ్రి బోరున విలపించారు. కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే శివమ్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన కొడుకు ఆత్మహత్యకు యువతి, ఆమె మరో స్నేహితుడే కారణమంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంజయ్ పేర్కొన్నారు. శివమ్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యువతితోనే మాట్లాడాడని, ఆ తర్వాతే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు తెలిపాడు. అతడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొంది. -
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!