Andhra News: వీడిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ మిస్టరీ.. వివరాలు వెల్లడించిన కాకినాడ ఎస్పీ
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హాత్య కేసు మిస్టరీ వీడింది. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాకినాడు ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాకు వెల్లడించారు.
కాకినాడ: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హాత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాకు వెల్లడించారు. ‘‘సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఆయన తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశాం. సుబ్రహ్మణ్యం బంధువులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హత్య కేసుగా నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా లభించిన ప్రాథమిక ఆధారాలు, వాంగ్మూలాల ఆధారంగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశాం. హత్య ఘటనపై నిన్న డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగించాం. ప్రధాన నిందితుడి కోసం 6 బృందాలుగా ఏర్పడి గాలించాం. ఇవాళ ఉదయం ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నాం. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. విచారణలో అనంతబాబు చెప్పిన వివరాల ప్రకారం, దర్యాప్తులో భాగంగా లభించిన సాంకేతిక ఆధారాల మేరకు ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా పరిగణించి అరెస్టు చేశాం. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ఏఆర్ కార్యాలయం నుంచి అనంతబాబును జీజీహెచ్కు తరలించారు. ఏఆర్ కార్యాలయం నుంచి గట్టి బందోబస్తు మధ్య ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆ రోజేం జరిగిందంటే?
ఈ నెల 19న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఆ రోజు సుబ్రహ్మణ్యం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి మద్యం కొనుగోలు చేసి సమీపంలోని పాఠశాలలో మద్యం తాగారు. రాత్రి 10 గంటల వరకు వారు అక్కడే ఉన్నారు. అనంతరం సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో కలిసి రోడ్డుపైకి రావడం.. అదే సమయంలో అనంతబాబు తన కారులో అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారు. వీరిద్దరూ కొద్ది దూరం వెళ్లి జన్మభూమి పార్క్ ప్రాంతంలో టిఫిన్ తీసుకొని ఎమ్మెల్సీ నివాసం ఉన్న శంకర్ టవర్స్ శ్రీరాంనగర్ వైపు వెళ్లారు. అప్పుడు సమయం రాత్రి 10.30 అయింది. సుబ్రహ్మణ్యం వివాహానికి ఎమ్మెల్సీ కొంత నగదు సాయం చేశారు. దానిలో మృతుడు కొంత అప్పు తీర్చాడు. ఇంకొత ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ‘‘నువ్వు ప్రవర్తన మార్చుకుంటే నిన్ను మళ్లీ పనిలోకి తీసుకోవాలని మీ అమ్మ చెప్పింది. మళ్లీ తాగుతున్నావ్.. నీలో ఎలాంటి మార్పు రాలేదు’’ అని ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇలా ఎమ్మెల్సీ నివాసం దగ్గరకు వెళ్లగానే నువ్వు నీ ప్రవర్తన మార్చుకోలేదని సుబ్రహ్మణ్యాన్ని కొట్టడం జరిగింది. అప్పటికే తాగి ఉన్న సుబ్రహ్మణ్యం.. ఎందుకు కొడుతున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో నన్నే ఎదురు ప్రశ్నిస్తావా..? అంటూ కోపంతో ఉన్న ఎమ్మెల్సీ అతడి మెడ పట్టుకొని పక్కకు తోసేశాడు. దీంతో సుబ్రహ్మణ్యం అక్కడే ఉన్న డ్రైనేజీ గట్టుమీద పడడంతో తలకు గాయమైంది. నన్నే కొడతావా అంటూ సుబ్రహ్మణ్యం మరోసారి వాగ్వాదానికి దిగడంతో మరోసారి మెడపై చేయివేసి తోసేశారు. దీంతో మరోసారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తలకు గాయమైంది.
మర్డర్ను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం!
వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలని చూశారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేరు. అదే సమయంలో కారులో ఉన్న సుబ్రహ్మణ్యంకు వెక్కిళ్లు రావడం అనంతబాబు గమనించి తాగేందుకు నీరు ఇచ్చారు. తాగిన కొద్ది సేపటికే సుబ్రహ్మణ్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. శ్వాస ఆగిపోవడం గమనించిన అనంతబాబు.. అతడు మృతి చెందినట్లు నిర్ధరణకు వచ్చారు. గతంలో ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్గా పని చేసే సమయంలో సుబ్రహ్మణ్యంకు తాగి యాక్సిడెంట్ చేసిన చరిత్ర ఉంది. ఇలా చేసిన ప్రతిసారీ తీసుకెళ్లి ఇంట్లో దింపడం జరిగింది. ఏం చేయాలో అర్థం కాని ఎమ్మెల్సీ అనంతబాబు అదే సమయంలో ఓ ఆలోచన వచ్చింది. యాక్సిడెంట్ అనే స్టోరీ క్రియేట్ చేయాలని ఆలోచించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ ఉండడంతో సాధ్యపడలేదు. రోడ్డు ప్రమాదం అని చిత్రీకరించాలంటూ ఒంటిపై దెబ్బలు ఉండాలని భావించి వెంటనే సమీపంలోని డంపింగ్ యార్డుకు తీసుకెళ్లారు. అందుబాటులో ఉన్న కర్రలు, తాళ్లతో సుబ్రహ్మణ్యం శరీరంపై తీవ్రంగా గాయలు అయ్యేలా చేశారు.
కారు వదిలేసి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ..
ఆ అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో సుబ్రహ్మణ్యం తల్లికి ఫోన్ చేసి ‘సుబ్బుకు యాక్సిడెంట్ అయినట్లు నాకు ఫోన్ వచ్చింది. నేను అక్కడకి వెళ్తున్నాను. దగ్గర్లోని అమృత ఆస్పత్రికి తీసుకెళ్తున్నాను. మీరు అక్కడికి రండి అని’’ ఎమ్మెల్సీ చెప్పారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తానే స్వయంగా తీసుకెళ్లి ఇంట్లో వదిలేశారు. సుబ్రహ్మణ్యం ఒంటిపై ఉన్న గాయాలు చూసిన కుటుంబసభ్యులు ఇవి ప్రమాదం వల్ల తగిలిన గాయాలు కావని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం కుటుంబీకులు, ఎమ్మెల్సీ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దాదాపు గంట సేపు వారి మధ్య చర్చలు, వాగ్వాదం జరిగింది. ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు నిర్ణయించారు. వెంటనే ఎమ్మెల్సీ.. తన కారును అక్కడే వదిలేసి ద్విచక్రవాహనంపై అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇవన్నీ ప్రాథమిక దర్యాప్తు ద్వారా నిర్ధరణకు వచ్చిన వివరాలు’’ అని ఎస్పీ వివరించారు.
మెజిస్ట్రేట్ ముందు నిందితుడి హాజరు
మరోవైపు, విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ఏఆర్ కార్యాలయం నుంచి అనంతబాబును జీజీహెచ్కు తరలించారు. ఏఆర్ కార్యాలయం నుంచి గట్టి బందోబస్తు మధ్య ఆయన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అనంతబాబును మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి అనంతబాబుకు 14రోజుల పాటు రిమాండ్ విధించారు. పోలీసులు అనంతబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్