Telangana News: నిజామాబాద్‌ నుంచి కాశీయాత్రకు వెళ్లిన బస్సు బోల్తా

నిజామాబాద్ జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు ప్రమాదానికి గురైంది. బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో యాత్రికులతో కూడిన బస్సు బోల్తా పడింది.

Published : 25 May 2022 03:03 IST

నిజామాబాద్: జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు ప్రమాదానికి గురైంది. బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో యాత్రికులతో కూడిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నిజామాబాద్‌ జిల్లా వెల్మల్‌కు గ్రామానికి చెందిన సరలమ్మ(70) మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు ఔరంగాబాద్‌ పట్టణంలో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 24న 38 మంది యాత్రికులతో కూడిన ట్రావెల్స్‌ బస్సు నిజామాబాద్‌ నుంచి బయలుదేరింది. బస్సులో నిజామాబాద్ జిల్లా వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్‌తో పాటు పాటు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన యాత్రికులు ఉన్నారు. ఔరంగాబాద్‌లో ఓ హోటల్ వద్ద బస్సు ఆపుతుండగా వెనుకనుంచి లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని