Road Accident: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా 9మంది మృతి

మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది దగ్గరి  బంధువులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated : 19 Jan 2023 12:06 IST

ముంబయి: మహారాష్ట్రలో (Maharashtra) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రాయగఢ్‌ జిల్లా రెపోలీ గ్రామ పరిధిలో ముంబయి-గోవా జాతీయ రహదారిపై తెల్లవారుజామున ట్రక్కు, వ్యాన్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు.

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో చిన్నారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతులు హెడ్వీ ప్రాంతానికి చెందిన దగ్గరి బంధువులని రత్నగిరి జిల్లా ఎస్పీ సోమ్‌నాథ్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని