సిద్దిపేట జిల్లాలో రోడ్డుప్రమాదం: ముగ్గురి మృతి

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మండలంలోని గొల్లపల్లి రహదారిపై తుపాన్‌ వాహనం..

Published : 05 Feb 2021 02:21 IST

జగదేవ్‌పూర్‌‌: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మండలంలోని గొల్లపల్లి రహదారిపై తుపాన్‌ వాహనం- ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శాట్లపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ బరిగే రమేశ్‌ (35), శ్రీశైలం (26), గడ్డం కనకయ్య (38) మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రామునిపల్లి కనకవ్వ, మండల సుజాతగా గుర్తించారు.

క్షతగాత్రులను గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో శాట్లపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.  మరోవైపు మృతుల కుటుంబాలకు న్యాయం చేయలంటూ మృతదేహాలతో గ్రామస్థులు, బంధువులు రోడ్డుపై భైఠాయించారు. గజ్వేల్‌ సీఐ నారాయణ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.  

ఇవీ చదవండి..

నీటికుంటలో పడి నలుగురి మృతి

పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని