Hyd News: బాలుడిని కత్తితో పొడిచి రక్తం కారుతుండగానే సెల్ఫీ!

ప్రేమ వ్యవహారం ఇద్దరు బాలుర మధ్య చిచ్చురేపిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడిని మరో బాలుడు కత్తితో పొడిచాడు. రక్తం కారుతుండగానే సెల్ఫీ దిగినట్లు పోలీసులు తెలిపారు. నిన్న నగరంలోని

Updated : 18 May 2022 12:28 IST

హైదరాబాద్‌: ప్రేమ వ్యవహారం ఇద్దరు బాలుర మధ్య చిచ్చురేపిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడిని మరో బాలుడు కత్తితో పొడిచి.. రక్తం కారుతుండగానే సెల్ఫీ దిగినట్లు పోలీసులు తెలిపారు. నిన్న నగరంలోని రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌లో ఓ బాలుడిపై మరో బాలుడు కత్తితో దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. ఘటనపై రాజేంద్రనగర్‌ పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. అనంతరం బంజారాహిల్స్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో నివసించే ముగ్గురు బాలురు ఇంటర్‌ చదువుతున్నారు. వారిలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. వారిద్దరూ మిత్రులతో కలిసి అత్తాపూర్‌లోని మూసీకాలువ వద్దకు వెళ్లారు. అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో గొడవ జరిగింది. దీంతో ముందే ప్రణాళిక వేసుకున్న ఇద్దరు కలిసి మరో బాలుడిపై దాడికి పాల్పడ్డారు. కత్తితో పొడవడంతో బాలుడు కేకలు వేశాడు. దీంతో అక్కడున్న వారు పరారయ్యారు. సదరు బాలుడికి గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న లంగర్‌హౌస్‌ పోలీసులు ఉస్మానియాకు తరలించారు. కేసు తమ పీఎస్‌కు బదిలీ కావడంతో విచారణ చేపట్టిన బంజారాహిల్స్‌ పోలీసులు.. ఈ ఉదయం ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని