Delhi Murder: ఆ తల, చేతులు శ్రద్ధావేనా..?
సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య జరిగిన కొద్ది రోజులకు తూర్పు దిల్లీలోని ఓ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల, చేతులను పోలీసులు గుర్తించారు. అవి శ్రద్ధావేనా? కాదా అన్నది తెలియాల్సి ఉంది.
దిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసులో దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు అఫ్తాబ్ ఇచ్చిన వివరాలతో మృతురాలి శరీర భాగాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో దొరికిన గుర్తుతెలియని మృతదేహాలు/శరీర భాగాల కేసులపై పోలీసులు దృష్టిపెట్టారు. కాగా.. శ్రద్ధా హత్య జరిగిన కొద్ది రోజులకే తూర్పు దిల్లీలో ఓ చోట కుళ్లిపోయిన స్థితిలో తల, చేతులు లభించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తాజాగా బయటికొచ్చింది.
మే 18న దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో శ్రద్ధా హత్యకు గురైంది. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్న త్రిలోక్పురి ప్రాంతంలో ఈ ఏడాది జూన్లో కొన్ని గుర్తుతెలియని శరీరభాగాలను పోలీసులు గుర్తించారు. పాండవ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామ్లీలా మైదానానికి సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మనిషి తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం.. ఓ చెత్తకుప్పలో ఉన్న తల, చేతులను గుర్తించారు. అక్కడ పడేయడానికి ముందు ఆ శరీర భాగాలను ఫ్రిజ్లో భద్రపర్చినట్లు అప్పుటి ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
అవి ఒకే మృతదేహానికి చెందినవి అయి ఉంటాయని అప్పట్లో పోలీసులు భావించారు. దీంతో వాటిని ఎవరు పడేశారా అని తెలుసుకోవడం కోసం సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. ఈ కేసులో ఎటువంటి పురోగతి లభించకపోవడంతో తదుపరి దర్యాప్తు కోసం కేసును దక్షిణ దిల్లీ పోలీసులకు అప్పగించారు.
శ్రద్ధా హత్య జరిగిన కొద్ది రోజులకే ఈ అవయవాలను గుర్తించడంతో ఇప్పుడు పోలీసులు ఆ కేసుపై దృష్టిపెట్టారు. తూర్పు దిల్లీలో లభ్యమైన తల, చేతుల భాగాలను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. అవి శ్రద్ధావేనా? కాదా? అన్నది ఫోర్సెనిక్ నివేదిక వస్తేనే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. కాగా, హత్య అనంతరం ఆమెను గుర్తించడానికి వీల్లేకుండా తల భాగాన్ని కాల్చేసిన తర్వాత పారేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది.
శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికిన తర్వాత వాటిని దిల్లీలోని పలు చోట్ల విసిరేసినట్లు నిందితుడు అఫ్తాబ్ పోలీసులు విచారణలో అంగీకరించిన విషయం తెలిసిందే. ఎక్కువగా మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేసినట్లు చెప్పడంతో.. నిందితుడిని తీసుకుని అక్కడ వెతికారు. ఆ ప్రాంతంలో ఇప్పటివరకూ 10కి పైగా ఛిద్రమైన భాగాలు దొరికాయి. అయితే అవి శ్రద్ధావేనా? లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో ఇప్పటివరకు శ్రద్ధా తలను పోలీసులు గుర్తించలేదు. దీంతో పాటు ఆమెను చంపినట్లుగా భావిస్తున్న ఆయుధం, ఆమె దుస్తులను కనుగొనలేదు. హత్య జరిగి నెలలు కావడంతో ఆమె శరీరభాగాలు ఇప్పటికే కుళ్లిపోవడమో లేదా వీధి శునకాలు తినేయడమో జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ కేసు నిరూపణకు సాక్ష్యాధారాల సేకరణ పోలీసులకు సవాల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర