ఆస్తి కోసం తండ్రికి చిత్రహింసలు.. పశ్చిమ బెంగాల్లో వదిలేసిన కుమారుడు
ఆస్తి ఇవ్వలేదనే అక్కసుతో కన్న తండ్రిని తెలియని చోట వదిలేసి వేరే ప్రాంతానికి మకాం మార్చిన కుమారుడి ఉదంతమిది.. తెలుగువారైన వి.కృష్ణారావు(65) పశ్చిమ బెంగాల్లోని
మూడు నెలలు గాలించి.. కనుగొన్న తోబుట్టువు
కృష్ణారావు జగన్మోహన్రావు
ఖరగ్పుర్, న్యూస్టుడే: ఆస్తి ఇవ్వలేదనే అక్కసుతో కన్న తండ్రిని తెలియని చోట వదిలేసి వేరే ప్రాంతానికి మకాం మార్చిన కుమారుడి ఉదంతమిది.. తెలుగువారైన వి.కృష్ణారావు(65) పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఖరగ్పుర్లో నివసిస్తున్నారు. రైల్వేలో పనిచేసి, ఇటీవల రిటైర్ కాగా, ప్రభుత్వ పింఛన్ వస్తోంది. స్థిరాస్తిని తన పేరిట రాయాలని కృష్ణారావుపై కుమారుడు విజయ్కుమార్ ఒత్తిడి చేశారు. అందుకు అంగీకరించకపోవడంతో జులైలో అక్కడే ఓ షాపింగ్మాల్ ప్రాంతంలో తండ్రిపై దాడి చేశాడు. స్పృహ కోల్పోయిన కృష్ణారావును వదిలేసి వెళ్లిపోగా.. షాపింగ్మాల్ సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు. 10 రోజుల చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్న కృష్ణారావుతో విజయ్కుమార్ మళ్లీ గొడవ పడ్డారు. ఓ రోజు తన స్నేహితులతో కలిసి తండ్రిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిన విజయ్... మిడ్నాపూర్లోని వృద్ధుల పునరావాస కేంద్రంలో చేర్పించాడు. తన తండ్రికి మానసిక రోగం ఉందని చెప్పి.. హైదరాబాద్కు మకాం మార్చాడు. ఇక్కడ తండ్రి పింఛన్ తీసుకుంటూ, ప్రతినెలా రూ.5 వేలు పునరావాస కేంద్రానికి పంపించాడు.
మూడు నెలల అన్వేషణతో తెలిసిన ఆచూకీ
కృష్ణారావు తమ్ముడు జగన్మోహన్రావు తన అన్నయ్య గురించి విజయ్ను అడగ్గా.. ఎటో వెళ్లిపోయాడంటూ దాటవేశాడు. అయినా, మూడు నెలల పాటు తోబుట్టువు జాడ కోసం ఖరగ్పుర్ చుట్టుపక్కల ఆసుపత్రులు, సత్రాల్లో గాలించిన మోహన్రావు.. చివరకు అక్కడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంత మురళీ సాయంతో పునరావాస కేంద్రంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. కృష్ణారావును అప్పగించేందుకు అక్కడి సిబ్బంది తొలుత నిరాకరించగా.. ఆధారాలు చూపించి, వారికి నచ్చజెప్పి ఇటీవలే సోదరుడిని బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై ఖరగ్పుర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్