Crime News: భార్యపై అనుమానం..ఇద్దరు పిల్లలతో సహా భర్త ఆత్మహత్య

నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలతో కలిసి

Published : 24 Dec 2021 10:40 IST

దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలతో కలిసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వాడపల్లి ఎస్సై వీరశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మూనావత్‌ తండాకు చెందిన కిషన్‌ నాయక్‌ (35), భూలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు హర్షవర్ధన్‌ (8), అఖిల్‌ (6) ఉన్నారు. కిషన్‌ నాయక్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా భూలక్ష్మికి వేరే వ్యక్తితో సంబంధం ఉందని కిషన్‌ అనుమానిస్తున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 

ఈ క్రమంలో గురువారం రాత్రి కిషన్‌.. తన ఇద్దరు పిల్లలకు దుస్తులు కొంటానంటూ ఆటోలో తీసుకెళ్లాడు. తండా సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకెళ్లి జ్యూస్‌ బాటిళ్లలో పురుగు మందు కలిపి పిల్లలకు తాగించాడు. అనంతరం అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం గమనించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరశేఖర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని